చెన్నై మెరీనా బీచ్ సమీపంలోని శివాజీ గణేశన్ విగ్రహ వివాదం మరింతగా ముదురుతోంది. విగ్రహాన్ని తొలగించాలని ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలని కోరుతూ శుక్రవారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
చెన్నై, సాక్షి ప్రతినిధి:
తమిళనాడులో ఎంజీఆర్ తర్వాత అంతటి ప్రజాభిమానం కలిగిన వ్యక్తి నడిగర్ తిలగం శివాజీ గణేశన్. ఎంజీఆర్పై అభిమానానికి గుర్తుగా నగరంలో అనేక విగ్రహాలు ఉన్నాయి. బీచ్ వద్ద అతిపెద్ద సమాధి ఉంది. అలాగే శివాజీ గణేశన్ స్మృతి చిహ్నంగా 2006లో అప్పటి డీఎంకే ప్రభుత్వం బీచ్ రోడ్డులో విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఆ విగ్రహాన్ని ముఖ్యమంత్రి హోదాలో కరుణానిధి ప్రారంభించారు. రోడ్డు కూడలిలో ఉన్నందున ట్రాఫిక్కు ఇబ్బందులు కలుగుతున్నాయని, ప్రమాదాలు జరుగుతున్నాయని ఇటీవల వివాదం పుట్టుకొచ్చింది. విగ్రహాన్ని తొలగించాలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. దీంతో అభిమానులు మద్రాసు హైకోర్టును ఆశ్రరుుంచారు. అక్కడ వాదోపవాదాలు పూర్తయి ఎట్టకేలకు విగ్ర హాన్ని అక్కడి నుంచి తొలగించి మరెక్కడైనా ప్రతిష్ఠించాలని హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది.
వెల్లువెత్తుతున్న అభ్యంతరాలు
కోర్టు తీర్పుపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ శివాజీ గణేశన్ అభిమానుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ శుక్రవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ప్రభాకరన్ వాదనలు వినిపిస్తూ తీర్పుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. అలాగే విగ్రహం తొలగింపు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. తీర్పుపై స్టే విధించేందుకు, ఈ పిటిషన్ను అత్యవసర కేసుగా స్వీకరించేందుకు నిరాకరిస్తున్నట్లు న్యాయమూర్తులు సతీష్కుమార్, అగ్రిహోత్రి, కేకే శచీంద్రన్ పేర్కొన్నారు. విగ్రహ తరలింపు అభ్యంతర పిటిషన్ను సాధారణ కేసుగా కొనసాగించుకోవచ్చని తెలిపారు. ఇదిలా ఉండగా శివాజీ గణేశన్ కుమారులు రామ్కుమార్, ప్రభు శుక్రవారం తమ స్పందనను తెలిపారు.
దేశవ్యాప్తంగా లక్షలాది అభిమానులు కలిగిన తమ తండ్రి విగ్రహం తరలింపుపై ప్రభుత్వం తగిన నిర్ణయాన్ని తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ప్రకటించారు. విగ్రహం విషయంలో అభిమానులు ఆందోళనలు చేయవద్దని వారు కోరారు. శివాజీ గణేశన్ విగ్రహ వివాదం వెనుక అధికార పార్టీ దురుద్దేశం దాగి ఉందని డీఎంకే కోశాధికారి స్టాలిన్ వ్యాఖ్యానించారు. శివాజీ విగ్రహాన్ని కరుణానిధి ప్రారంభించినందునే దాన్ని తొలగింపు కుట్రకు పాల్పడుతోందని ఆరోపించారు. కేంద్ర మంత్రి జీకే వాసన్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఏడేళ్లుగా అభిమానులను అలరిస్తున్న శివాజీ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించాల్సిన అవసరం లేదన్న సంగతిని ప్రభుత్వం గుర్తించాలని పేర్కొన్నారు.
ముదురుతున్న ‘శివాజీ’ వివాదం
Published Sat, Jan 25 2014 3:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
షర్మిల ఆడియో లీక్
మాకు ఓటు వేయకుంటే కరెంట్ కట్: కాంగ్రెస్ ఎమ్మెల్యే బెదిరింపు!
తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం.. 48 గంటలపాటు ప్రచారం ఆపేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం .. ఇంకా ఇతర అప్డేట్స్
సింగర్ హత్య కేసు నిందితుడిపై కాల్పులు.. స్పాట్లోనే!
అభివృద్ధి ఎంత జరిగిందో ప్రజల్లో ఉంటే తెలుస్తుంది బుగ్గన అర్జున్ రెడ్డి కామెంట్స్
హామీలు కాదు..చెవిలో పువ్వులు..టీడీపీ మేనిఫెస్టో చూసి మోదీ షాక్
కైకేయి.. శూర్పణఖ... ఏదైనా ఓకే
జయహో జోయా
మన సర్పంచులు @ ఐరాస
కృష్ణమ్మతో సత్యదేవ్ స్టార్ అవుతాడు: రాజమౌళి
తప్పక చదవండి
- MLC Kavitha: కవిత బయటకు వచ్చేనా?
- జయహో జోయా
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
Advertisement