చిన్న పార్టీలకు సీట్ల కేటాయింపుల్లో డీఎంకే నిమగ్నమైంది. మంగళవారం పెరుంతలైవర్ మక్కల్ కట్చి, వ్యవసాయ కార్మిక పార్టీకి తలా ఓ సీటును కేటాయించారు. పుదియ తమిళగంతో చర్చలు వేగవంతం చేశామని డీఎంకే దళపతి స్టాలిన్ పేర్కొన్నారు.
సాక్షి, చెన్నై: డీఎంకేలో సీట్ల పంపకాల పర్వం వేగంగా సాగుతున్నది. ఇప్పటి వరకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, మనిద నేయ మక్కల్ కట్చిలకు తలా ఐదు సీట్లు చొప్పున పది ఖరారు చేశారు. డీఎంకేకు మరికొన్ని చిన్న పార్టీలు, ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన సంఘాలు మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో వీరితో చర్చించి సీట్ల కేటాయింపుల్లో స్టాలిన్ నేతృత్వంలోని కమిటీ నిమగ్నం అయింది. మంగళవారం పెరుంతలై వర్ మక్కల్ కట్చి నేత ఎన్ ఆర్ధనపాలన్తో చర్చించారు. ఐదు సీట్లను వారు ఆశించగా, ఒక్క సీటుకు స్టాలిన్ పరిమితం చేశారు.
పెరంబూరు నియోజకవర్గానికి వారికి అప్పగించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చి బుజ్జగించడం తో ఎన్ఆర్ ధనపాలన్ ఒక్క సీటుకు అం గీకరించారు. అయితే, డీఎంకే చిహ్నం ఉదయ సూర్యుడిపై పోటీ చేయనున్నా రు. వ్యవసాయ కార్మిక పార్టీ నేత పొన్ కుమార్ నేతృత్వంలోని బృందం స్టాలిన్ కమిటీతో భేటీ అయింది. వారికి కూడా ఒక్క సీటును కేటాయించారు. ఈ రెండు పార్టీల నేతలు గోపాలపురం చేరుకుని డీఎంకే చిహ్నం బరిలో పోటీకి తగ్గ ఒప్పంద పత్రాల మీద సంతకాలు చేశారు. మరికొన్ని చిన్న పార్టీలకు సీట్ల సర్దుబాటులో స్టాలిన్ నిమగ్నం అవుతూ, పుదియ తమిళగంతో చర్చలు వేగవంతం చేశామన్నారు.
ఇక, ఐదు సీట్లను ఆశించిన ఎస్డీపీఐకు డీఎంకే మళ్లీ అవకాశం ఇచ్చేనా, అత్యధిక స్థానాల్ని ఆశిస్తున్న కాంగ్రెస్ విషయంలో ఎలాంటి నిర్ణయం వెలువరించేనా అన్న ప్రశ్న బయల్దేరింది. కాంగ్రెస్ తలకిందులుగా తపస్సు చేసినా, ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా వారు ఆశించే సీట్లు, స్థానాల్ని ఇచ్చే ప్రసక్తే లేదని డీఎంకే వర్గాలు పేర్కొంటుండడం గమనార్హం. తాము ఇచ్చే స్థానాలతో సర్దుకోవడం, సూచించే సీట్లలో అభ్యర్థుల్ని బరిలోకి దించుకోవాల్సిన వంతు కాంగ్రెస్కు తప్పదంటున్నారు. ఇదిలా ఉండగా, రెండు రోజుల క్రితం కరుణానిధిని డీఎంకే బహిష్కృత నేత అళగిరి కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దక్షిణాది జిల్లాల్లో అత్యధికంగా కొత్త వాళ్లకు, యువకులు, మహిళలకు సీట్లు ఇవ్వాలని కరుణానిధికి అళగిరి సూచించి ఉన్నట్టుగా డీఎంకే వర్గాలు చర్చ సాగుతుండడం గమనార్హం.
చిన్న పార్టీలకు సీట్లు
Published Wed, Mar 30 2016 2:17 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
Advertisement