రోడ్డెక్కనున్న ఏడువేల బస్సులు
నేటి నుంచి పరుగులు
కోయంబేడులో ప్రత్యేక కౌంటర్లు
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక బస్సుల్ని నడిపేందుకు రాష్ర్ట రవాణాశాఖ అన్ని ఏర్పాట్లూ చేసింది. ఈ బస్సులు శనివారం నుంచి పరుగులు తీయనున్నాయి. టికెట్ రిజర్వేషన్ నిమిత్తం కోయంబేడులో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు.
చెన్నై: సంక్రాంతి వచ్చిందంటే సంబరాలే. భోగి, సంక్రాంతి, పశువుల పండుగ రోజుల్లో గ్రామగ్రామాన సందడే. ఈ పండుగను కుటుంబ సభ్యులందరితో కలిసి జరుపుకునేందుకు ఎక్కడెక్కడి వారు సొంత గ్రామాలకు చేరుకుంటుంటారు. దీంతో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతుంటాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న రైల్వే యంత్రాంగం చెన్నై నుంచి దక్షిణాది జిల్లాల వైపుగా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ రైళ్లు ఇప్పటికే హౌస్ ఫుల్ అయ్యాయి. అన్ రిజర్వుడ్లో ఇసుకేస్తే రాలనంతగా జనం పయనించాల్సి ఉంది. అలాగే ఆమ్నీ బస్సుల దోపిడీ రెట్టింపు అవుతోంది. ప్రయాణికుల ఇబ్బందుల్ని గుర్తెరిగిన రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ నేతృత్వంలో ప్రత్యేక బస్సుల్ని నడిపేందుకు సిద్ధమైంది.
నేటి నుంచి పరుగులు
చెన్నై కోయంబేడు బస్ టెర్మినల్ నుంచి సాధారణంగా నడిచే బస్సులతోపాటుగా సంక్రాంతి స్పెషల్గా 7250 బస్సుల్ని నడిపేందుకు నిర్ణయించారు. చెన్నై నుంచి అన్ని జిల్లా కేంద్రాల కు, నగరాలు, పట్టణాలకు ఈ బస్సులను నడపనున్నారు. అలాగే ఆయా జిల్లా కేంద్రాలు, నగరాల నుంచి ఇతర ప్రాంతా లకు, చెన్నైకి అదనపు బస్సులు పయనించనున్నాయి. సంక్రాంతికి మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ దృష్ట్యా శనివారం నుంచే బస్సుల్ని నడిపేందుకు రంగం సిద్ధమైంది. చెన్నై నుంచి శనివారం 600, 11న 470, 12న 720, 13న 1408, 14న 1456 బస్సుల్ని నడపనున్నారు. ఈ నెల 15న ప్రయాణికుల సంఖ్యను బట్టి బస్సుల్ని రోడ్డెకించనున్నారు. శనివారం నుంచి ఇతర ప్రాంతాల నుంచి చెన్నై, తదితర ప్రాంతాలకు 300 బస్సులు, 11న 400, 12న 500, 13న 595, 14న 800 వందలు బస్సులు రోడ్డెక్కనున్నాయి. పండుగను ముగించుకుని తిరుగు పయనం అయ్యే వారికి కోసం 16 నుంచి 19వ తేదీ వరకు పై సంఖ్యలోనే బస్సులు పరుగులు తీస్తాయి. 300 కిమీ పైబడి పయనించేవారు రిజర్వేషన్ చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. కోయంబేడు బస్టాండ్ ఆవరణలో 25 కౌంటర్లు ఏర్పాట్లు చేశారు. అలాగే ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు.
చెన్నై నగరంలో..
చెన్నై మహానగరంలోనూ ప్రత్యేక బస్సులు నడపనున్నారు. సంక్రాంతి మరుసటి రోజు నుంచి నగర వాసులు ఎక్కువగా పర్యాటక ప్రాంతాలకు వెళ్లడం ఆనవాయితీ. కనుమ, ముక్కనుమ రోజుల్లో పర్యాటక కేంద్రాలు జన సందోహంతో నిండి ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కోయంబేడు, ప్యారిస్, టీ.నగర్, తాంబరం తదితర ప్రధాన బస్టాండ్ల నుంచి కోవళం, మహాబలిపురం, ముట్టుకాడు, పళ్లికర నై, వీజీపీ, కిష్కిందా, క్వీన్స్ లాండ్, మెరీనా, బీసెంట్ నగర్ బీచ్లు తదితర పర్యాటక కేంద్రాల మీదుగా 250 ప్రత్యేక బస్సుల్ని నడపనున్నారు.
స్పెషల్ బస్సులు రెడీ
Published Sat, Jan 10 2015 1:56 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ప్రశాంత పోలింగ్కు పటిష్ట చర్యలు
టీడీపీ చీప్ ట్రిక్స్
డబ్బు పంపిణీపై దృష్టి పెట్టిన అభ్యర్థులు
అద్భుతంగా చందనోత్సవం: స్వరూపానందేంద్ర సరస్వతి
ఎలక్షన్ స్పెషల్స్!
స్టీల్ప్లాంట్పై ప్రకటన చేస్తే పోటీకి దూరం
కేజీహెచ్ నర్సింగ్ సూపరింటెండెంట్ సరెండర్
పతంగుల పోటీలో ఘోరం.. గొంతు తెగి ఆరుగురు విలవిల.. 35 మందికి గాయాలు!
ఐటీతో రాజకీయ కుట్ర
నేటితో ప్రచారానికి తెర
తప్పక చదవండి
- సమంత వద్ద జాబ్ చేయాలనుకుంటున్నారా..? ఇలా సంప్రదించండి
- గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
- ఢిల్లీలో హఠాత్తుగా మారిన వాతావరణం.. ఈదురు గాలులతో అతలాకుతలం!
- Rahul Gandhi: యూపీలో ‘ఇండియా’ తుపాను
- 27 రోజులు.. 57 సభలు, రోడ్ షోలు
- మీ భూమి మీదే..
- బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దు
- పసిడికి అక్షయ తృతీయ శోభ
- CM Jagan: కదిలించిన కడప చైతన్యం
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement