రాష్ట్రంలో తమ బలం పెరుగుతుండడంతో కమలనాథుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో నాలుగున్నర లక్షల మంది కమలం తీర్థం పుచ్చుకున్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయడానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ సిద్ధమయ్యారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ నిమిత్తం 234 మంది సిబ్బందిని నియమించారు. వీరికి శిక్షణ ఇచ్చి ప్రజల్లోకి పంపించేందుకు నిర్ణయించారు.
- నాలుగున్నర లక్షల మంది చేరిక
- సభ్యత్వ నమోదు వేగవంతం
సాక్షి, చెన్నై: రాష్ర్టంలో అసెంబ్లీ ఎన్నికల ద్వారా తమ సత్తా చాటుకోవడం లక్ష్యంగా కమలనాథులు ఉరకలు పరుగులు తీస్తున్నారు. కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టినానంతరం పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ హవా కొనసాగడంతో రాష్ర్టంలోని కమలనాథులు ఆశల పల్లకిలో ఊగిసలాడుతున్నారు. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్ర త్యామ్నాయ శక్తిగా తాము అవతరించడం ఖాయం అన్న ధీమాతో ఉన్నారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టడం లేదా, అధికారాన్ని శాసించే స్థాయికి ఎదగాలన్న కాంక్షతో ముందుకు దూసుకెళ్తున్నారు.
జోష్: సభ్యత్వ నమోదు పర్వానికి గత నెల మొదటి వారంలో శ్రీకారం చుట్టినా, పది రోజుల క్రితం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా చెన్నై పర్యటనతో స్పందన పెరిగింది. మోబైల్టోల్ ఫ్రీ నంబర్లను అమిత్షా ప్రకటించడం, ఈ నంబర్లకు ప్రచారం పెరగడంతో కమలం వైపు చూసే వారిసంఖ్య పెరుగుతోంది. మార్చి నెలా ఖరులోపు 60 లక్షల మందిని చేర్పించే లక్ష్యం గా చేపట్టిన సభ్యత్వ నమోదు పర్వానికి స్పంద న పెరగడం కమలనాథుల్లో ఆనందాన్ని రేకెత్తిస్తోంది. ఇదే ఉత్సాహంలో ముందుకు సాగి అమిత్షా నిర్ణయించిన లక్ష్యాన్ని చేరుకునేందు కు ఉరకలు పరుగులు తీసే పనిలో పడ్డారు.
వేగవంతం: సభ్యత్వ పర్వాన్ని వేగవంతం చేయడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణకు నిర్ణయించారు. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక నిరంతర సిబ్బం దిని సభ్యత్వ నమోదు ప్రక్రియకు ఎంపిక చేశారు. వీరందరికీ శిక్షణ ఇప్పించే పనిలోపడ్డారు. శుక్రవారం ఉదయం పూందమల్లిలోని ఓ హాల్లో ఈ సిబ్బందికి శిక్షణ తరగతులు ఆరంభమయ్యాయి.
బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధరరావు, రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్, ప్రధాన కార్యదర్శి సంతోష్ల నేతృత్వంలో శిక్షణ తరగతులు ఉదయం నుంచి రాత్రి వరకు జరిగాయి. కేంద్రంలో గతంలో వాజ్పేయ్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వ సేవలను, పార్టీ పరంగా ప్రజల్ని ఆకర్షించే అస్త్రాలతో ఈ శిక్షణ తరగతులు జరిగాయి.
ఛేదిస్తాం: పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా నిర్ణయించిన లక్ష్యాన్ని మార్చి నెలాఖరులోపు ఛేదిస్తామని తమిళి సై సౌందరరాజన్ ధీమా వ్యక్తం చేశారు. శిక్షణ తరగతుల్లో భాగంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. అమిత్షా చెన్నై పర్యటనతో పార్టీలో ఉత్సాహం రెట్టింపు అయిందన్నారు.
అందరూ కలసి కట్టుగా సభ్యత్వ నమోదును వేగవంతంచేసే పనిలో పడ్డారన్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ నిమిత్తం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించిన ఘనత తమ పార్టీకే దక్కుతుందన్నారు. రో జుల వ్యవధిలో నాలుగున్నర లక్షల మంది తమ పార్టీలోకి వచ్చారని, మున్ముందు తమ బలం పెరగనుందని, తామే ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతున్నామని తెలిపారు.
Related news
-
‘అర్బన్ నక్సల్స్’ను ఎన్నుకుని పొరపాటు చేయొద్దు
భరూఛ్: ఓటు వేసి అర్బన్ నక్సలైట్లను ఎన్నుకునే పొరపాటు ఎప్పుడూ చేయొద్దని గుజరాత్ ఓటర్లకు బీజేపీ అగ్రనేత అమిత్ షా హితవు పలికారు. గుజరాత్లోని భరూఛ్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ మన్సుఖ్ వాసావా తరఫున శనివారం ఎన్నికల ర్యాలీలో అమిత్షా మాట్లాడారు. ‘‘ మన్సుఖ్లాంటి చక్కని ప్రజా ప్రతినిధి ఇంకొకరు మీకు దొరకదు. పొరపాటున వేరేవాళ్లకు ఓటేస్తే అర్బన్ నక్సలైట్లలో ఒకరు ఎంపీ సీటులో కూర్చుంటారు. ఈ గిరిజన ప్రాంతాన్ని నాశనం చేస్తారు. ప్రజలను లూటీచేసేందుకు ఆప్, కాంగ్రెస్ కలిసి వచ్చాయి. కాంగ్రెస్ గిరిజనుల వ్యతిరేక పార్టీ.ఓట్లేశాక ఆప్ గిరిజనులను గాలికొదిలేస్తుంది. 400 మెజారిటీతో బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆప్, కాంగ్రెస్ చెప్పేవన్నీ అసత్యాలు. అబద్ధాలు ప్రచారం చేయడంలో కాంగ్రెస్ నైపుణ్యం సాధించింది. ఆప్ సర్దార్ స్థాయికి ఎదిగింది. నిజంగానే మేం రాజ్యాంగాన్ని మార్చేవారమే అయితే ఈ పదేళ్లు అధికారంలో ఉన్నపుడే మార్చేవాళ్లంకదా?’ అని వ్యాఖ్యానించారు. ‘‘ ఆదివాసీలు, దళితులు, ఓబీసీల రిజర్వేషన్లను మేం ముట్టుకోబోం.ఎవరినీ ముట్టుకోనివ్వం కూడా. గిరిజనుల ప్రాథమిక హక్కులను ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) లాగేసుకుంటుందని ఆప్, కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. యూసీసీకి గిరిజనులకు సంబంధమే లేదు. భరూఛ్లో ఆప్ అభ్యర్థి ఛైతర్ వాసావా లేనిపోనివి ప్రచారంచేస్తున్నారు. ఆదివాసీలకు మోదీ ఎల్లప్పుడూ మిత్రుడే’’ అని అమిత్ షా చెప్పారు. -
కాంగ్రెస్ మేనిఫెస్టోపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్న తరుణంలో.. బీజేపీ కీలక నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ మేనిఫెస్టో మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీ మీద ప్రజల్లో మరింత మొగ్గు పెరిగిందని అన్నారు.గతంలో మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో బుజ్జగించే పాత అలవాటును పునరావృతం చేసిందని అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో వ్యక్తిగత చట్టాన్ని ముందుకు తీసుకెళ్తుందని, ఇది దేశాన్ని విభజించేలా ఉందని షా పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం, ఇచ్చిన మాటపైన నిలబడే పార్టీని ఎన్నుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. భారతదేశంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ షరియా చట్టాన్ని అమలు చేయాలనుకుంటున్నట్లు అమిత్ షా అన్నారు. మన రాజ్యాంగం లౌకికమైనది, దేశంలోని చట్టాలు మతం ఆధారంగా రూపొందించబడలేదు. కాబట్టి అవన్నీ అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సుకు ఉపయోగపడతాయని అమిత్ షా ఉద్ఘాటించారు.యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) తీసుకువస్తామని బీజేపీ తన మ్యానిఫెస్టోలో స్పష్టంగా చెప్పిందని హోంమంత్రి చెప్పారు. ట్రిపుల్ తలాక్ను రద్దు చేసి యూసీసీని ప్రారంభించాం, దీనిని ముందుకు తీసుకెళ్తాం. వ్యక్తిగత చట్టాలను ఈ దేశంలో అమలు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.Bhopal, MP | Union Home Minister Amit Shah says, "After Congress manifesto was released, people's inclination towards BJP has further increased...Congress manifesto speaks of taking forward Personal Law. I would like to ask Rahul Gandhi, will this country now run on Sharia?" pic.twitter.com/HVUMy3uVqP— ANI (@ANI) April 26, 2024 -
ఢిల్లీకి ఏటీఎంగా మార్చేశారు.. కాంగ్రెస్పై అమిత్ షా ఫైర్
సాక్షి, సిద్దిపేట: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిందని.. ఢిల్లీకి ఏటీఎంగా మార్చేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావుకు మద్దతుగా సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ‘బీజేపీ విశాల జన సభ’ నిర్వహించారు.అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశవ్యాప్తంగా 400కుపైగా స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని.. తెలంగాణలో 12 సీట్లను గెలవబోతున్నామని అన్నారు. గత పదేళ్లలో దేశం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను ప్రధాని మోదీ పరిష్కరించారని చెప్పారు. జమ్ము కశ్మీర్లో 370 ఆర్టికల్ను రద్దు చేసి.. 70 ఏళ్ల సమస్యను పరిష్కరించామన్నారు. కశ్మీర్ను భారత్లో శాశ్వతంగా అంతర్భాగం చేశామన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మించడం కాంగ్రెస్కు ఇష్టం లేదని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్లకు మజ్లిస్ అంటే భయం మజ్లిస్కు భయపడటం వల్లే బీఆర్ఎస్, కాంగ్రెస్లు తెలంగాణ విమోచన దినోత్సవానికి దూరంగా ఉన్నాయని అమిత్ షా విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని, అవి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు నిండా అవినీతిలో మునిగిపోయారని ఆరోపించారు. మోదీని మూడో సారి ప్రధాన మంత్రిని చేస్తే అవినీతిని పూర్తిగా అంతం చేస్తామని చెప్పారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా చెప్పారు. ఆ స్థానంలో ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు తెస్తామని ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. మెదక్ ఎంపీ స్థానంలో బీజేపీ కమలం పువ్వును వికసింపజేయాలని, ఎంపీగా రఘునందన్రావును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ది నయవంచన: రఘునందన్రావు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోవడం నయవంచనేనని బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే నయవంచనకు పర్యాయపదమని విమర్శించారు. మోదీ అంటే గ్యారంటీ అని.. విశ్వసనీయమైన నాయకుడంటే మోదీయేనని పేర్కొన్నారు. సిద్దిపేట సభలో మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సహరా ఇండియా బాధితుల నిరసన సహరా ఇండియా సంస్థలో డిపాజిట్ చేసిన డబ్బులు వెనక్కి రాక ఇబ్బంది పడుతున్న వరంగల్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు చెందిన బాధితులు అమిత్ షా సభలో నిరసన తెలిపారు. తమకు డబ్బు చెల్లించాలని, న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే పోలీసులు వారిని సభ నుంచి బయటికి పంపించారు. -
బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: నాడు వ్యాపారం ముసుగులో బ్రిటీషు ఈస్టిండియా కంపెనీ వాళ్లు దేశాన్ని ఆక్రమించుకునేందుకు సూరత్ నుంచి బయలుదేరి వచ్చారని.. నేడు అదే సూరత్ నుంచి మోదీ, అమిత్షా బయలుదేరారని టీపీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి విమర్శించారు. బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ అని.. ఇక్కడ బ్రిటిష్ వాళ్లలా ఆక్రమణ ఎజెండాను అమలు చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అమలు చేస్తోందని.. మళ్లీ అధికారంలోకి వస్తే దళితుల రిజర్వేషన్లను రద్దు చేస్తుందని మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల సెగ్మెంట్ పరిధిలోని రాజేంద్రనగర్లో గురువారం నిర్వహించిన కాంగ్రెస్ రోడ్ షోలో రేవంత్రెడ్డి మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్నారు. వారికి ఏ ఒక్కరోజు కూడా ప్రజలు గుర్తుకురాలేదు. బీజేపీని 400 సీట్లలో గెలి పించాలని మోదీ అంటున్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. దేశంలో రిజర్వేషన్లను ఎత్తివేయడం ఖాయం. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్తకాదు. 70 ఏళ్లు ఈ దేశాన్ని పాలించింది. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించింది. ఆ రిజర్వేషన్లను మోదీ ప్రభుత్వం రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోంది. రూ.లక్ష కోట్లతో మూసీ అభివృద్ధి..: వికారాబాద్లో మొదలైన మూసీ నది నల్లగొండ దాకా కలుషితంగా మారిపోయింది. ఈ మూసీని ప్రక్షాళన చేసి, హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్లను అభివృద్ధి చేయాలన్నా.. వికారాబాద్ను పర్యాటక ప్రదేశంగా మార్చాలన్నా చేవెళ్లలో కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్రెడ్డిను గెలిపించాలి. గతంలో కాంగ్రెస్ పాలనలో వికారాబాద్ శాటిలైట్ సిటీ, ఎంఎంటీఎస్ రైలును మంజూరు చేస్తే.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక వాటిని రద్దు చేసింది. రూ.లక్ష కోట్లతో మూసీ రివర్ ఫ్రంట్ను అభివృద్ధి చేస్తాం. కాలుష్యాన్ని నియంత్రించడంతోపాటు భూముల ధరలు పెంచే బాధ్యత నాది. మతవాదులకు బుద్ధి చెప్పాలి: దేవుడు గుడిలో ఉండాలి. భక్తి గుండెల్లో ఉండాలి. బీజేపీ వాళ్లు ఇప్పుడే శ్రీరామనవమి, హనుమాన్ జయంతిని కనిపెట్టినట్టు చెప్తున్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మతతత్వ వాదులకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి కుటుంబానికి మంచి చరిత్ర ఉంది. కానీ ఆయన బీజేపీలో చేరి కలుషితమయ్యారు. చేవెళ్లలో రంజిత్ను భారీ మెజార్టీతో గెలిపించాలి. బిడ్డకు బెయిల్ కోసం బలహీన అభ్యర్థి: కేసీఆర్ సీఎంగా పదేళ్లు కొనసాగారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు. బీఆర్ఎస్ కారు పనైపోయింది. ఇది తెలిసే కేసీఆర్ బస్సు వేసుకుని బయలు దేరారు. ఆయన ఎంత మొసలి కన్నీరు కార్చినా ప్రజలు నమ్మడం లేదు. బిడ్డకు బెయిల్ కోసమే చేవెళ్లలో బలహీనమైన అభ్యర్థిని బరిలో నిలిపారు..’’అని పేర్కొన్నారు. సంక్షేమానికి పెద్ద పీట వేసేది కాంగ్రెసే..: రంజిత్రెడ్డి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలను అమలు చేసి మాట నిలబెట్టు కుందని ఆ పార్టీ చేవెళ్ల అభ్యర్థి రంజిత్రెడ్డి చెప్పారు. రాజేంద్రనగర్ రోడ్ షోలో ఆయన మాట్లాడారు. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ పెద్ద పీట వేస్తుందన్నారు. ప్రస్తుతం సెక్యులర్ కాంగ్రెస్ పార్టీ, మతతత్వ బీజేపీ మధ్య పోరు జరుగుతోందని వ్యాఖ్యానించారు. కంటోన్మెంట్ సమస్యలు తీరుస్తాం..: రేవంత్ రసూల్పురా (హైదరాబాద్): సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తీరుస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. గురువారం మల్కాజిగిరి లోక్సభ స్థానం పరిధిలోని బాలంరాయి కమాన్ నుంచి అన్నానగర్ వరకు నిర్వహించిన రోడ్ షో, కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం కంటోన్మెంట్ ప్రాంతంలో రోడ్లు మూసేసి ప్రజలను ఇబ్బందులు పెట్టిందని ఆరోపించారు. ఇక్కడ రిజి్రస్టేషన్ల విషయంలో, తాగునీటి విషయంలో సమస్యలు ఉన్నాయన్నారు. ‘‘కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే సాయన్న నాకు మంచి మిత్రుడు. ఆయన ఎమ్మెల్యే పదవిలో ఉండగా మరణించారు. అయినా కేసీఆర్ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయించలేదు. అదే సినిమా వాళ్లు చనిపోతే మాత్రం ఏడు రౌండ్లు గాల్లోకి పోలీసు కాల్పులతో అధికార లాంఛనాలు చేయించారు..’’అని మండిపడ్డారు. కాంగ్రెస్ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్రెడ్డిని, కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీగణేశ్లను గెలిపించాలని పిలుపునిచ్చారు. -
'కమలం టార్గెట్' రెండంకెల బలం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రెండంకెల (డబుల్ డిజిట్) ఎంపీ సీట్లు కైవసం చేసుకోవాలని కమలదళం ఉవ్విళ్లూరుతోంది. 17 ఎంపీ సీట్లకు గాను 10 నుంచి 12 స్థానాలు గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది. రాష్ట్రంలో అత్యధిక లోక్సభా స్థానాల్లో గెలుపొందిన పార్టీగా రికార్డు సృష్టించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీని, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పూర్తిస్థాయిలో వెనక్కి నెట్టేలా ఫలితాలు రాబట్టాలని బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు గట్టి పట్టుదలతో ఉన్నాయి. ఆ రెండు పార్టీల కంటే ముందుగా ఇప్పటికే ఓ రౌండ్ ప్రచారాన్ని ముగించుకున్న బీజేపీ అదే దూకుడుతో ముందుకెళ్లాలని భావిస్తోంది. అభ్యర్థుల నామినేషన్ దాఖలు కార్యక్రమాల్లో జాతీయ స్థాయి నేతలు పాల్గొనేలా వ్యూహరచన చేయడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రేకెత్తిస్తోన్న కమలదళం, అగ్రనేతల పర్యటనలతో ప్రచార పర్వాన్ని మరింత వేడెక్కించే ప్రయత్నాల్లో ఉంది. మోదీ మ్యాజిక్పైనే ఆశలు రాష్ట్రంలో గత రెండు నెలల్లో ఐదు సభల్లో పాల్గొన్న ప్రధాని మోదీ ఓ విడత ప్రచారం పూర్తి చేయడంతో రాష్ట్ర పార్టీకి ఊపు వచ్చింది. మిగతా పార్టీల కంటే ముందుగానే ప్రచారాన్ని ప్రారంభించడంతో పాటు రాష్ట్ర పార్టీ నాయకులు, కార్యకర్తలకు మోదీ దిశానిర్దేశం చేశారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఐదు రోజులు ఐదు చోట్ల బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, శంకుస్థాపనలు చేశారు. ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి ముందే రాష్ట్రంలో తొలివిడత ప్రచారాన్ని పూర్తిచేశారు. గత పదేళ్ల పాలనలో కేంద్రంలో తమ ప్రభుత్వం సాధించిన ప్రగతితో పాటు, గతంతో పోల్చితే వివిధ వర్గాల అభ్యున్నతి కోసం పెద్దయెత్తున అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గురించి ప్రజలకు వివరించారు. గత పదేళ్లలో తెలంగాణకు వివిధ పథకాల ద్వారా కేంద్రం చేకూర్చిన లబ్ధి, వివిధ రంగాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించిన నిధులు తదితరాలు వెల్లడించడం ద్వారా ప్రజల్లో విశ్వాసం కల్పించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీపై ప్రజల్లో సానుకూలత పెరిగిందని, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వివిధ వర్గాల నుంచి లభిస్తున్న మద్దతు, వరుసగా మూడోసారి మోదీ ప్రధాని అవుతారనే అభిప్రాయం.. తెలంగాణలోనూ గట్టిగా పనిచేస్తుందని, పార్టీకి డబుల్ డిజిట్ సీట్లు సాధించి పెడుతుందని జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు గట్టిగా విశ్వసిస్తున్నారు. పార్టీపరంగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన వివిధ సర్వేల్లో పార్టీకి ప్రజల్లో మద్దతు పెరిగిందని, మెజారిటీ ఎంపీ సీట్లలో గెలుపొందుతామని ముఖ్య నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కార్యాచరణ వేగవంతం డబుల్ డిజిట్ లక్ష్య సాధనకు ఇప్పటికే ప్రాథమిక కసరత్తును పూర్తిచేసిన బీజేపీ.. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికల అమలును వేగవంతం చేసింది. వివిధ సామాజిక వర్గాలను కలుసుకునేందుకు ప్రత్యేకంగా కార్యక్రమాలను చేపడుతోంది. జిల్లాలు, పార్లమెంట్ నియోజక వర్గాలు, అసెంబ్లీ సెగ్మెంట్ల స్థాయిలో వివిధ కుల సంఘాలతో సమ్మేళనాలు, యువత, మహిళలు, రైతులు, ఎస్సీలు, ఎస్టీలు ఇలా వివిధ వర్గాల వారితో ఎక్కడికక్కడ వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా పోలింగ్ బూత్ల వారీగా ఓటర్లను పలుమార్లు కలవడమే లక్ష్యంగా ముందుకు వెళుతోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటి అగ్రనేతల పర్యటనల సందర్భంగా మాత్రమే పెద్ద బహిరంగ సభలను నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. మిగతా ఎన్నికల ప్రచారమంతా ఇంటింటికీ వెళ్లడం, స్వయంగా ఓటర్లను కలవడం, కార్నర్ మీటింగ్లు లాంటి ఔట్ రీచ్ కార్యక్రమాల ద్వారా నిర్వహించేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇంటింటి ప్రచారంలో భాగంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ కరపత్రం, ప్రచారానికి సంబంధించిన స్టిక్కర్, పార్టీ జెండా, ఓటర్లకు ఎంపీ అభ్యర్థి విజ్ఞప్తి పత్రం (అప్పీల్) లాంటివి అందజేస్తున్నారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో రెండోవిడత, వచ్చేనెల 9,10,11 తేదీల్లో మూడోవిడత ప్రచారాన్ని పూర్తిచేయనున్నారు. 4, 6, 8 తేదీల్లో మోదీ పర్యటన రాష్ట్రంలో మే 13న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మే 4, 6, 8 తేదీల్లో ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. పార్టీ నేతలు, కార్యకర్తల్లో జోష్ నింపేలా ఆయన పర్యటన ఉంటుందని సమాచారం. ఇందులో భాగంగా విమానాశ్రయానికి సమీపంలోని ఓ ఇండోర్ స్టేడియంలో ఐటీ వృత్తి నిపుణులతో మోదీ ప్రత్యేకంగా సమావేశమై ఓ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్టు తెలిసింది. అదే విధంగా ఓటర్లలో యాభై శాతం మంది దాకా మహిళలు ఉండడంతో వీరిని ఆకట్టుకునేలా మహిళా మోర్చా ఆధ్వర్యంలో మోదీతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర పార్టీ నాయకత్వం నిర్ణయించింది. నల్లగొండ, భువనగిరి, వరంగల్, మహబూబాబాద్; ఖమ్మం ఎంపీ సీట్లలో ఎన్నికల ప్రచారాన్ని కవర్ చేసేలా జనగామలో లేదా అక్కడికి దగ్గరలో మోదీ పాల్గొనేలా ఓ సభ నిర్వహించాలని భావిస్తోంది. అదేవిధంగా హైదరాబాద్లో లేదా నగర శివార్లలో జరిపే భారీ బహిరంగ సభతో తెలంగాణలో మోదీ ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నట్టు సమాచారం. రేపు రాష్ట్రానికి అమిత్ షా బీజేపీ అగ్రనేత అమిత్ షా లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాష్ట్రానికి రానున్నారు. ఉదయం 9 గంటలకు ఢిల్లీలో బయలుదేరి 11.10 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి సిద్దిపేట చేరుకుంటారు. డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట వరకు సభ ఉంటుంది. అనంతరం 1.45 గంటలకు విమానాశ్రయానికి చేరుకుని రెండున్నర గంటలపాటు అక్కడ ఉంటారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులతో సమావేశమై ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం 4.15 గంటలకు బయలుదేరి భువనేశ్వర్కు వెళ్తారు.
Related News by category
-
యువకుడికి అరుదైన డీప్ బ్రెయిన్ శస్త్రచికిత్స
సాక్షి, చైన్నె: ప్రొగ్రసివ్ మయోక్లోనస్ ఎపిలెప్సీతో బాధ పడుతున్న 23 ఏళ్ల యువకుడికి అరుదైన డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ శస్త్ర చికిత్సను గ్లెనెగల్స్ హెల్త్ సిటీ వైద్యులు విజయవంతం చేశారు. రెండు చిన్న రంధ్రాల ద్వారా మెదడులో ఎలక్ట్రోడ్లను అమర్చా రు. ఈ శస్త్ర చికిత్స గురించి సోమవారం గ్లెనెగల్స్ న్యూరాలజీ అండ్ అడ్వాన్స్డ్ ఎంటర్ ఫర్ ఎపిలెప్సీ డైరెక్టర్ డాక్టర్ దినేష్నాయక్ వివరించారు. పది సంవత్సరాల వయస్సు నుంచి నాగ్పూర్కు చెందిన యువకుడు(23) అరుదైన మూర్చ వ్యాధి లక్షణాలతో బాధ పడుతూ వచ్చాడని పేర్కొన్నారు. హఠాత్తుగా కింద పడి పోవడం, మాట రాక పోవడం, స్పృహ తప్పడం వంటి లక్షణాలు ఇతడిలో క్రమంగా పెరిగాయన్నారు. కొంతకాలం స్వస్థలంలోనే చికిత్స పొందినా, ఆకస్మాత్తుగా పరిస్థితి దయనీ యంగా మారడంతో హెల్త్ సిటీలో చేర్చినట్టు తెలిపారు. అన్ని రకాల పరిశోధనలతో అరుదైన డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (డీబీఎస్) శస్త్ర చికిత్స నిర్వహణకు చర్యలు తీసుకున్నామని వివరించారు. న్యూ రో సర్జన్ హెడ్ డాక్టర్ నిగెల్ సిమ్స్, అనస్తీషియా డాక్టర్ రమణన్ తదితర వైద్య బృందం సహకారంతో 8 గంటలు శ్రమించి రెండు దశల్లో శస్త్రచికిత్సను విజయవంతం చేశామన్నారు. మెదడులోని నిర్ధిష్ట కేంద్రంలోకి ఎలక్ట్రోడ్లను అమర్చినట్టు వివరించా రు. ప్రస్తుతం యువకుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు, తన రోజు వారి పనులన్నీ తానే చేసుకుంటున్నట్టు చెప్పారు. సమావేశంలో హెల్త్ సిటీ సీఈఓ డాక్టర్ నగేష్ కే రావు పాల్గొన్నారు. -
రథోత్సవం
వైభవంగా సాక్షి, చైన్నె: మదురై మీనాక్షి అమ్మవారి సన్నిధిలో చిత్తిరై ఉత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం అమ్మవారి వివాహ మహోత్సవం అత్యంత వేడుకగా జరగ్గా, సోమవారం రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఈ సందర్భంగా వేకువ జామున ఆలయంలో స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. అభిషేకాది పూజల అనంతరం స్వామి, అమ్మవార్లను వేర్వేరుగా అలంకరించారు. సర్వాలంకారంతో ఉన్న స్వామి అమ్మవార్లు రథంపై ఆశీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అతిపెద్ద రథంలో సుందరేశ్వర స్వామి, మరో రథంలో మీనాక్షి అమ్మవారి ఆశీనులయ్యారు. ఆలయం ఆవరణ నుంచి ఉదయం 7 గంటలకు రథాలు ఒకదాని తర్వాత మరొకటి భక్త జనుల శివనామస్మరణ మధ్య ముందుకు కదిలాయి. మీనాక్షి అమ్మవారి ఆలయ తక్కర్ రుక్మిణి పళణి వేల్, దేవదాయ శాఖ జాయింట్ కమిషనర్ చెల్లదురై, ఆలయ జాయింట్ కమిషనరన్ కృష్ణన్ రథాలకు జెండా ఊపారు. కీల్ మాసివీధి, తెర్కు మాసి వీధి, మేల్ మాసి వీధి, వడక్కుమాసి వీధులలో 5 కి.మీ దూరం రథోత్సవం కనుల పండువగా జరిగింది. ఈ రథాలకు ముందుగా గజరాజులు, ఎద్దులు కదిలాయి. శివాచార్యులు, శివ శక్తులు శంఖం పూరిస్తూ, డమరకం వాయిస్తూ శంభో శంకరా, నమశ్శివాయ నామస్మరణ మారుమోగింది. వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, గజేంద్రుడు తదితర దేవుళ్ల ఉత్సవ విగ్రహాలను సప్పరాలలో ఉంచి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అడుగడుగునా భక్తజనులు స్వామి, అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్త కోటి శివనామ స్మరణ నడుమ స్వామివారి రథం ముందుకు సాగగా, వెనుక అమ్మవారి రథం అనుకరించింది. మధ్యాహ్నం 12 గంటలకు స్వామి వారి రథోత్సవం పూర్తయ్యింది 12.10 గంటలకు అమ్మవారి రథం ఆలయం వద్దకు చేరుకున్నాయి. వేలాదిగా భక్త జనం తరలి రావడంతో మదురై జన సంద్రంలో మునిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి భద్రతా ఏర్పాట్లను జిల్లా పోలీసు యంత్రాంగం చేసింది. అలాగే భక్తుల సేవలో పలు సంఘాలు తరలించాయి. ఎండ వేడి నుంచి ఉపశమనం కల్గించే విధంగా శీతల పానీయాల్ని అందజేశాయి. నేడు వైగై నదీ ప్రవేశం ఈ ఉత్సవాల్లో అత్యంత ముఖ్య ఘట్టం మంగళవారం వైగై నదీ తీరంలో జరగనుంది. మదురైలో శైవం, వైష్ణవం సంబంధిత రెండు ఉత్సవాలు చిత్తిరై మాసంలో జరిపే విధంగా 400 ఏళ్ల క్రితం ఈ గడ్డను పాలించిన తిరుమలై నాయకర్ చర్యలు తీసుకున్నట్లు చరిత్ర చెబుతోంది. అంతకుమునుపు వేర్వేరుగా ఈ ఉత్సవాలు జరిగినా, తిరుమలై నాయర్ ఆదేశాలకు అనుగుణంగా శైవ,వైష్ణవ ఉత్సవాల మేళవింపుగా చిత్తిరై మాసంలో కనుల పండువగా వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ రెండు ఉత్సవాల మేళవింపుగా మీనాక్షి అమ్మవారి కల్యాణాన్ని తిలకించేందుకు తేనూరు నుంచి కళ్లలగర్ స్వామివారు (విష్ణుమూర్తి) బయలుదేరి రావడం, వైగై నదీ ప్రవేశ ఘట్టం జరగడం ఈ ఉత్సవాలలో ప్రత్యేకత. ఈ వేడుకల నిమిత్తం తేనూర్ నుంచి ఆదివారం రాత్రంతా బంగారు పల్లకిలో ప్రయాణించిన కళ్లలగర్ సోమవారం సాయంత్రానికి మదురైకు చేరుకున్నారు. రాత్రంతా దారి పొడవున భక్త జనులు కర్పూర హారతులు పట్టారు. అలాగే ఆ మార్గంలోని పలు ఆలయాల వద్ద స్వామివారిని ఆహ్వానిస్తూ పూజాది కార్యక్రమాలు జరిగాయి. మూండ్రు మావడి వద్ద స్వామి వారికి ఎదుర్ సేవ అత్యంత వేడుకగా జరిగాయి. తల్లాకులం ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న అళగర్ స్వామికి ప్రత్యేక తిరుమంజనం జరిగింది. ఇక్కడి నుంచి మంగళవారం ఉదయం జరిగే విశిష్ట పూజల అనంతరం శ్రీవిల్లి పుత్తూరు ఆండాల్ ఆలయం నుంచి వచ్చిన పూల మాలను ధరించి, బంగారు అశ్వరథంపై స్వామివారు వైగై నదీ ప్రవేశానికి వెళ్లనున్నారు. ఇందుకోసం ఆళ్వార్ పురం వైగై నదీ తీరంలో సర్వం సిద్ధం చేశారు. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు లక్షల్లో భక్తులు తరలి వస్తారు దీంతో గట్టి భద్రతా ఏర్పాట్లు జరిగాయి. ఆధ్యాత్మిక నగరాన్ని నిఘా నీడలోకి తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా మదురై ఉత్సవాల వ్యవహారం హైకోర్టుకు చేరిన విషయం తెలిసిందే. కళ్లలగర్ వైగై నదీ ప్రవేశం అనంతరం జరిగే ఎదుర్ సేవ సందర్భంలో వాహనంపై ఎలాంటి నీరూ చల్లకూడదనే ఆంక్షలను కోర్టు ఇప్పటికే విధించింది. దీనిని అమలు చేయడానికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అలాగే వైగై నది ప్రవేశ ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లకు అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకున్నారు. ఈ పనులను పరిశీలించిన మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం సంతృప్తిని వ్యక్తం చేసింది. రథోత్సవంలో పాల్గొన్న భక్తులుమదురై వీధులు భక్త జన సంద్రమయ్యాయి. సోమవారం అంగరంగ వైభవంగా మీనాక్షి సుందరేశ్వర స్వామి రథోత్సవం సాగింది. ఇక చిత్తిరై ఉత్సవాల్లో మరో ప్రధాన ఘట్టమైన కళ్లలగర్ వైగై నదీ ప్రవేశం మంగళవారం ఆళ్వార్ పురంలో జరగనుంది. ఇందుకోసం తేనూరు నుంచి కళ్లలగర్ స్వామి(విష్ణుమూర్తి) మదురైకు చేరుకున్నారు. భక్తులను అనుగ్రహించిన మీనాక్షీ సుందరేశ్వర స్వామి జన సంద్రమైన ఆధ్యాత్మిక నగరం నేడు కళ్లలగర్ వైగై నదీ ప్రవేశం ఏర్పాట్లు పూర్తి మదురైకు చేరుకున్న స్వామి వారు -
పరందూరుకు మెట్రో
● పూందమల్లి నుంచి విస్తరణ పనులు ● నివేదిక రెడీ ● 19 రైల్వే స్టేషన్ల ఏర్పాటుకు నిర్ణయం సాక్షి, చైన్నె : పూందమల్లి నుంచి పరందూరుకు మెట్రో రైలు పనులకు సంబంధించిన నివేదిక తాజాగా సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు కోసం రూ. 10,712 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించారు. మొత్తం 43.66 కి.మీ దూరం ఏర్పాటు చేసే మెట్రో రైలు మార్గంలో 19 రైల్వే స్లేషన్లు నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను మెట్రో యాజమాన్యం ప్రభుత్వ అనుమతి కోసం పంపించింది. వివరాలు.. చైన్నెలో ప్రస్తుతం ఫేజ్ –1 పనులు ముగియడంతో రెండు మార్గాలలో మెట్రో రైలు సేవలకు విపరీతమైన స్పందన వస్తున్న విషయం తెలిసిందే. ఫేజ్– 2లో మరో మూడు మార్గాలలో పనులకు కార్యాచరణ సిద్ధం చేశారు. రూ. 63, 246 కోట్లతో 118.9 కి.మీ దూరం లైట్ హౌస్ – పూందమల్లి మధ్య 26.1 కి.మీ, మాధవరం – సిరుచ్చేరి సిప్కాట్ మధ్య 45.8 కి.మీ, మాధవరం నుంచి షోళింగనల్లూరు వరకు 47 కి.మీ దూరం మెట్రో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మార్గలలో అత్యధిక దూరం రైలు భూగర్భ మార్గంలోనే పయనించనుంది. ఈ పరిస్థితులలో పూందమల్లి వరకు ఉన్న మెట్రో సేవను పరందూరు వరకు విస్తరించేందుకు కార్యాచరణను రూపొందించారు. కొత్త విమానాశ్రయం వరకు .. చైన్నె మీనంబాక్కం విమానాశ్రయంలో పెరిగిన రద్దీతో మరో ఎయిర్పోర్టు నిర్మాణంపై కేంద్రం దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఇందుకోసం కాంచీపురం జిల్లా పరిధిలోని పరందూరును ఎంపిక చేశారు. చైన్నె నుంచి 60 కి.మీ దూరంలోని పరందూరులో 4,798 ఎకరాల స్థలంలో రూ. 40 వేల కోట్లతో పనులు చేపట్టేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే సమయంలో ఈ విమానాశ్రయాన్ని వ్యతిరేకిస్తూ ఏకనాపురం వేదికగా 13 గ్రామాల ప్రజలు ఉద్యమాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. వీరంతా లోక్ సభ ఎన్నికలను సైతం బహిష్కరించారు. ఈ పరిస్థితులలో కొత్త విమానాశ్రయ టెర్మినల్ రూపుదిద్దుకునే పరందూరుకు మెట్రో రైలు సేవలకు సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను మెట్రో అధికారులు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపించారు. ప్రభుత్వ అనుమతి వచ్చిన తర్వాత టెండర్ల ప్రక్రి యపై దృష్టి పెట్టాలని మెట్రో వర్గాలు నిర్ణయించాయి. అంచనా వ్యయంగా రూ. 10,712 కోట్లు పూందమల్లి – పరందూరు మధ్య మెట్రో రైలు పనులకు రూ. 10,712 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. 43.66 కి.మీ దూరం వంతెన మార్గంలో పనులు చేపట్టబోతున్నారు. ఈ మార్గంలో 19 రైల్వే స్టేషన్లు, మల్లీ లెవల్ పార్కింగ్ సెంటర్లు, మాల్స్ తదితర నిర్మాణాలకు సంబంధించిన అంశాలను సమగ్ర నివేదికలో పొందు పరిచారు. చైన్నె నగరంలో సగటున కి.మీ లేదా 1.5 కి.మీ దూరానికి ఒక మెట్రో రైల్వే స్టేషన్ ఉన్నాయి. అయితే పూందమల్లి – పరందూరు మార్గంలో కొన్ని చోట్ల రెండు, మరికొన్ని చోట్ల మూడు కి.మీ దూరానికి ఓ రైల్వే స్టేషన్ ఏర్పాటు కానుంది. రైలు అతి వేగంగా విమానాశ్రయం వైపుగా దూసుకెళ్లే విధంగా దూరాన్ని పెంచి రైల్వే స్టేషన్ల ఏర్పాటు కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ మేరకు పూందమల్లి, నషరత్ పేట చెక్ పోస్టు, చెంబరంబాక్కం, తిరుమలిసై టౌన్షిప్, పాపన్ చత్రం, చెట్టి పేడు, తండలం, ఇరుంగాట్టు కోట్టై, పొన్నలూరు, శ్రీపెరంబదూరు, పట్టునూల్ చత్రం, ఇరుంకులం పారిశ్రామిక వాడ, మాంబాక్కం, తిరుమంగళం, సుంకువారి చత్రం, సంత వేలూరు, పిల్లై చత్రం, నీర్వల్లూరు, పరందూరులలో రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేయడానికి ఈ నివేదికలో వివరాలను పొందు పరిచారు. -
గుకేశ్కు శుభాకాంక్షల వెల్లువ
సాక్షి, చైన్నె: భారత యువ చదరంగ క్రీడాకారుడు గుకేశ్ దొమ్మరాజు ప్రఖ్యాత ప్రపంచ చెస్ ఫెడరేషన్ టోర్నమెంట్లో విజయం సాధించడంతో తమిళనాడులోని రాజకీయ పార్టీల నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం స్టాలిన్ పేర్కొంటూ, గతంలో భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ సాధించిన ఘనతను ప్రస్తుతం అతి పిన్న వయసులో చరిత్ర సృష్టించే విధంగా టైటిల్ను గుకేశ్ సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. గతంలో తనను గుకేశ్ కలిసిన సందర్భంగా తీసిన ఫొటోను తన సామాజిక మాధ్యమంలో సీఎం స్టాలిన్ షేర్ చేశారు. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ పేర్కొంటూ, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నా రు. గుకేశ్ టైటిల్ దక్కించుకోవడం దేశానికే కాదు తమిళనాడుకు గర్వకారణంగా పేర్కొన్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి, బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ తదితరులు సైతం గుకేష్కు అభినందనలు తెలియజేశారు. విశ్వనాథన్ ఆనంద్ సైతం శుభాకాంక్షలు తెలుపుతూ అత్యంత పిన్న వయస్సులో ఈ టైటిల్ దక్కించుకోవడం అభినందనీయమన్నారు. ఇదిలా ఉండగా కెనడా వేదికగా జరిగిన క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించిన గుకేష్ తమిళనాడుకు చెందిన తెలుగు కుటుంబానికి చెందిన కుర్రోడు అనే విషయం తెలిసిందే. చైన్నెలో స్థిరపడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదా వరి జిల్లాకు చెందిన తెలుగు కుటుంబం రజనీకాంత్, పద్మ దంపతుల కుమారుడు గుకేశ్. అతి చిన్న వయస్సులో భారత గ్రాండ్ మాస్టర్గా ప్రస్తుతం చరిత్ర సృష్టించిన గుకేశ్ చైన్నె శివారులోని అయనంబాక్కంలోని ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నాడు. రజనీకాంత్ ఈఎన్టీ వైద్యుడు కాగా, పద్మ మైక్రోబయాలజిస్టుగా ఉన్నారు. చైన్నెకు టైటిల్తో రాబోతున్న గుకేశ్కు ఘన స్వాగతం పలికేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గుకేశ్ -
యాప్ కొంప ముంచింది!
● ఓటింగ్ శాతంలో గందరగోళంపై ఎస్ఈసీ వివరణ ● సరిహద్దుల్లో మరింత నిఘా సాక్షి, చైన్నె: ఓటింగ్ శాతం గురించి ఎప్పటికప్పుడు సమాచార సేకరణకు సిద్ధం చేసిన యాప్ కొంప ముంచటంతోనే తీవ్ర గందరగోళం ఏర్పడినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సత్యప్రద సాహు పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల రోజున యాప్ కారణంగా సమస్య ఏర్పడినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యాప్ ద్వారా పోలింగ్ బూత్ అధికారులు ఆయా బూత్లలో నమోదైన ఓట్ల వివరాలను అప్లోడ్ చేయాల్సి ఉందన్నారు. తప్పని సరిగా ఇందులో నమోదు చేయాలనే ఆదేశాలు ఇవ్వక పోవడంతో అనేక మంది పూర్తి స్థాయిలో పోలింగ్ శాతం గురించి స్పష్టత ఇవ్వలేక పోయారని వివరించారు. ఎన్నికల అధికారులు ఓటింగ్ శాతం పరిశీలించి సంతకాలు చేసి తమకు తెలియజేసేలోపు జాప్యం నెలకొందన్నారు. దీంతో యాప్లో ఉన్న వివరాలు, సమాచారం ఆధారంగా మీడియాకు ఎప్పటికప్పుడు ఓటింగ్ గురించి వివరాలను తెలియజేశామన్నారు. ఈ ప్రక్రియలో జాప్యం, గందరగోళం కారణంగానే సమగ్ర వివరాలను ప్రకటించేందుకు కొంత సమయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. 12 జిల్లాలో తనిఖీలు రాష్ట్రంలో ఎన్నికల కోడ్లో సడళింపులు చేశామని పేర్కొంటూ, తమిళనాడు పొరుగున ఉన్న కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలో ఎన్నికలు జరుగుతుండటాన్ని పరిగణించి ఆ రాష్ట్రాల సరిహద్దులలో నిఘా ఉంచామన్నారు. ఈ రాష్ట్రాల సరిహద్దులలోని తమిళ జిల్లాలు తిరువణ్ణామలై, వేలూరు, తిరుపత్తూరు, కృష్ణగిరి, సేలం, ఈరోడ్, నీలగిరి, కోయంబత్తూరు, తేని, తిరునల్వేలి, కన్యాకుమారి, తెన్కాశి జిల్లాలో మాత్రం 57 ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీల్లో నిమగ్నమైనట్లు వివరించారు. ఈ బృందాలు షిఫ్ట్ల వారీగా విధులలో ఉంటాయని, ఇక్కడి నుంచి ఆ రాష్ట్రాలకు నగదు, ఇతర వస్తువులు తరలించకుండా తనిఖీలు విస్తృతంగా సాతున్నాయన్నారు. సరిహద్దులు దాటే వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. రాష్ట్రంలోని జిల్లాల మధ్య రూ. 50 వేలకు పైగా నగదు తీసుకెళ్లేందుకు ఇప్పటికే అనుమతి ఇచ్చామన్నారు. పైన పేర్కొన్న జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల సరిహద్దులు దాటే వారి వద్ద రూ.50 వేలకు పైగా నగదు ఉంటే సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.
Advertisement
Photos
View allVideo
View allహైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement