= రైతు బలవన్మరణంపై ఉద్యమించిన బీజేపీ, రైతుసంఘం, హసిరుసేన
= మండ్య, శివమొగ్గలో ధర్నాలు
శివమొగ్గ/మండ్య, న్యూస్లైన్ : బెల్గాం సువర్ణవిధానసౌధ ఎదురుగా రైతు విఠల అరభావి ఆత్మహత్య చేసుకునేందుకు రాష్ర్ట ప్రభుత్వమే కారణమని, వెంటనే సర్కార్ గద్దె దిగాలని బీజేపీ, దాని అనుబంద సంఘాలతోపాటు రైతు సంఘం, హసిరుసేన ఆందోళనకు దిగాయి. శివమొగ్గలో హసిరుసేన, రైతుసంఘం కార్యకర్తలు శివప్పనాయక సర్కిల్లో, బీజేపీ కార్యకర్తలు గోపీసర్కిల్లో ధర్నాలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం కర్ణాటక రైతుసంఘం, హసిరుసేన రాష్ట్రాధ్యక్షుడు కేటీ.గంగాద ర్ మాట్లాడుతూ.....రాష్ట్ర ప్రభుత్వం చెరకుకు మద్దతు ధర కల్పించకపోవడంతో దిక్కుతోచక రైతు ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. వెంటనే చెరుకుకు మద్దతు ధర కల్పించడంతోపాటు మృతుడి కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ చెరుకుకు మద్దతు ధర కోసం రైతులు బెల్గాం సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి దర్నా చేస్తున్నా ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రి రైతులతో సమావేశమై చర్చించిన పాపాన పోలేదని మండిపడ్డారు.
ఈ ప్రభుత్వానికి పాలించే హక్కు లేదన్నారు. సిద్ధరామయ్య వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రైతు మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అదేవిధంగా మండ్యలో రైతు మోర్చ నాయకులు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలను చేశారు. అనంతరం నాల్వడి కృష్ణరాజ ఒడెయార్ సర్కిల్లో ధర్నా చేశారు.
నాయకులు మాట్లాడుతూ రైతు మృతికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, చెక్కరశాఖ మంత్రి కారణమన్నారు. తక్షణమే సీఎంతోపాటు సదరు మంత్రి తమ పదవులకు రాజినామ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను హత్య చేయడానికి కూడ వెనుకాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం దిగి వచ్చి చెరుకుకు గిట్టుబాటు ధరను కల్పించాలని, మృతుడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండు చేశారు. రైతు మోర్చ అధ్యక్షుడు రవీంద్ర, సిద్దరాజు గౌడ, సిద్దరామయ్య, జోగిగౌడ, కృష్ణెగౌడ, జవరేగౌడ పాల్గొన్నారు.
రాష్ర్ట సర్కార్ గద్దె దిగాలి
Published Fri, Nov 29 2013 5:26 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement