రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

Published Tue, Feb 14 2017 2:21 AM

student dies in road accident

అన్నానగర్‌: నసరత్‌పేట సమీపంలో స్కూటర్‌ను వ్యాన్‌ ఢీ కొన్న ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఇతని బంధువులైన ఇంజినీరింగు కళాశాల విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. పోరూర్‌ సమీపం మొగలివాక్కం, భజనై ఆలయ వీధికి చెందిన పళని కుమారుడు ప్రవీణ్‌ రిజర్డ్‌సన్‌(15). ఇతను ఆ ప్రాంతంలో ఉన్న స్కూలులో పదో తరగతి చదువుతున్నారు. ఇతని బంధువుల కుమార్తె బ్యూలా(20) పూందమల్లిలో ఉన్న ప్రైవేటు ఇంజినీరింగు కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతోంది. పూందమల్లి సమీపం వెళ్లవేట్టిలో ఉన్న బంధువు గృహ ప్రవేశానికి ఆదివారం సాయంత్రం ఇద్దరు స్కూటర్‌పై వెళ్లారు. స్కూటర్‌ని బ్యూలా నడిపారు. వెనుక ప్రవీణ్‌ రిజర్డ్‌సన్‌ కూర్చొని ఉన్నారు.

ఈ స్థితిలో పూందమల్లి–బెంగళూరు హైవేలో నసరత్‌పేట సమీపానికి వెళ్లేటప్పుడు వెనుక అతి వేగంతో వచ్చిన ఓ వ్యాన్, స్కూటర్‌ను ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అదుపు తప్పి కింద పడ్డారు. దీంట్లో ప్రవీణ్‌ రిజర్డ్‌సన్‌కి తలపై తీవ్ర గాయాలయ్యాయి. బ్యూలాకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ దారిన వెళుతున్న వాహన చోదకులు ఇద్దరినీ పూందమల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దారి మధ్యలోనే ప్రవీణ్‌ రిజర్డ్‌సన్‌ మృతి చెందాడు. గాయాలతో ఉన్న బ్యూలా కీల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

దీనిపై సమాచారం అందుకున్న పూందమల్లి ట్రాఫిక్‌ నేర విభాగం పోలీసులు, మృతి చెందిన ప్రవీణ్‌ రిజర్డ్‌సన్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంకా దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన వ్యాన్‌ డ్రైవర్‌ పళణిస్వామి(35)ని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

Advertisement
Advertisement