Sakshi News home page

‘నవనిర్మాణ’ సబ్‌ కమిటీ ఏర్పాటు

Published Fri, May 19 2017 1:49 PM

sub committee on Nava Nirmana Deeksha

అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విభజన జరిగిన జూన్‌ 2వ తేదీన ఏపీ ప్రభుత్వం నిర్వహించే నవనిర్మాణ దీక్ష నిర్వహణపై మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు అయింది. అచ్చెన్నాయుడు, కాలువ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాసరావులతో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జూన్‌ 2 వ తేదీ నుంచి 8 వ తేదీ వరకు జరిగే కార్యక్రమాలపై విధివిధానాల ఖరారుకు ఈ కమిటీని నియమించారు.
 

Advertisement
Advertisement