చెన్నై, సాక్షి ప్రతినిధి: రాజకీయ పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్న అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నజీమ్జైదీ మంగళవారం తుదివిడత చర్చలు జరుపుతున్న తరుణంలో నోటిఫికేషన్ జారీ చేస్తారని ఢిల్లీ వర్గాల భోగట్టా. తమిళనాడు ప్రభుత్వానికి మే 22వ తేదీతో గడువు ముగుస్తుంది. ఈ లోగా అసెంబ్లీ ఎన్నికలను పూర్తిచేసి కొత్త ప్రభుత్వాన్ని కూర్చోబెట్టాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ది. ఇందుకోసం ఎన్నికల కమిషనర్ ఏర్పాట్లపై తలమునకలై ఉన్నారు. ఎన్నికల పోలింగ్కు అవసరమైన యంత్రాలు ఇతర రాష్ట్రాల నుంచి తమిళనాడుకు చేరుకున్నాయి.
నకిలీ ఓటర్ల తొల గింపు కార్యక్రమం గత నెల 15 నుంచి 29వ తేదీ వరకు సాగింది. బందోబస్తుకు సీఆర్పీఎఫ్ దళాలను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 65వేల పోలింగ్ కేంద్రాల్లో 38 వేల కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించి వెబ్కెమెరాలను అమర్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఇలా అన్ని రకాల పనులను నూరుశాతం పూర్తి చేసిన దశలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అందరిలానే నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎదురుచూస్తోంది. రాష్ట్రంలోని ఎన్నికల అధికారులందరికీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజేష్లఖానీ మంగళవారం అత్యవసర ఉత్తరాలు పంపారు. నోటిఫికేషన్ వెలువడగానే కొత్తగా ప్రభుత్వ పథకాలను ప్రకటించరాదు, అమలు చేయరాదని ఆ ఉత్తరం ద్వారా ఆదేశించారు.
అలాగే సీఎం జయలలిత సైతం సోమవారం అత్యవసరంగా సమావేశం అయ్యారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో చేపట్టిన అన్ని పథకాల ప్రచార చిత్రాలను వీడియో కాన్ఫరెన్స్ద్వారా హడావిడిగా విడుదల చేశారు. సోమవారం ప్రారంభించిన అనేక పథకాలు, నిర్మాణాలు అసంపూర్తిగా ఉండగానే ప్రారంభించడం సీఎం హడావిడితనానికి అద్దం పట్టింది. ఇందువల్ల ఎన్నికల తేదీ ముఖ్యమంత్రికి ముందే చెప్పి ఉంటారనే ప్రచారం కూడా సాగుతోంది. ఇటువంటి సంకేతాల కారణంగా బుధ, గురువారాల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడం ఖాయమని తెలుస్తోంది. ‘ఎన్నికల తేదీపై నిర్ణయం జరిగిపోయింది, ఈ నెల 4వ తేదీ సాయంత్రం లేదా 5 వ తేదీ ఉదయం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది’ అని రాష్ట్ర ఎన్నికల అధికారి ఒకరు రహస్య సమాచారం ఇచ్చారు.
ఈసీకి డీఎంకే విజ్ఞప్తి
ఎన్నికల్లో ఓటర్లకు నగదు పంపిణీ సాగకుండా అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారులను నియమించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజేష్లఖానికి డీఎంకే విజ్ఞప్తి చేసింది. పార్టీ లీగల్సెల్ సహాయ కార్యదర్శి పరంధామన్ మంగళవారం సచివాలయంలో ఈసీని కలిశారు. గత పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్కు రెండు రోజుల ముందు ఎన్నికల కమిషన్ 144 సెక్షన్ ఉత్తర్వులు జారీ చేయడంతో అధికార అన్నాడీఎంకే, పోలీసులు తమకు అనుకూలంగా మలచుకున్నారని ఆరోపించారు. ఇటువంటి తప్పిదాలు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వ అధికారులను పరిశీలకులుగా నియమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రెండు రోజుల్లో నగారా
Published Thu, Mar 3 2016 3:10 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కౌంటీల్లో ఆడనున్న సన్రైజర్స్ మాజీ బౌలర్
ఉచిత రేషన్తో ప్రజల బతుకులు బాగుపడవు: ప్రియాంక గాంధీ
బాహుబలి పట్టాభిషేకం సీన్ తలపించిన సీఎం జగన్ సభ
చంద్రబాబు పై గాడిద సామెత
"నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది.." ఫుల్ జోష్ లో వంగా గీత
వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
బుల్లితెర నటి పర్సనల్ వీడియో లీక్
బేర్ పంజా..భారీ నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
బఠానీల ఉచిత దిగుమతి గడువు పెంపు
తప్పక చదవండి
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement