శశిపెరుమాళ్ బిడ్డల అరెస్ట్
టాస్మాక్ దుకాణాలను ఎత్తివేయాలని ఆందోళన
15 మంది ఆందోళనకారుల అరెస్ట్
చెన్నై, సాక్షి ప్రతినిధి: మద్యంపై పోరులో గాంధేయవాది శశిపెరుమాళ్ ప్రాణాలు కోల్పోగా ఆయన వారసులు పోరాటబాట పట్టారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు, కుమార్తె సహా 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోరాట యోధుడు, ప్రముఖ గాంధేయవాది శశిపెరుమాళ్ కన్యాకుమారి జిల్లా ఉన్నామలైకడైలోని మద్యం దుకాణాలను మూసివేయాలని కోరుతూ గత నెల 31వ తేదీన సమీపంలోని సెల్టవర్ ఎక్కాడు. ఆందోళన సాగిస్తున్న తరుణంలో గుండెపోటుకు గురై టవర్పైనే మృతి చెందాడు. శశిపెరుమాళ్ మృతదేహానికి ఆచారిపళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఈనెల 1వ తేదీన పోస్ట్మార్టం పూర్తిచే యగా రాష్ట్రంలో మద్య నిషేధం విధిస్తున్నట్లు ప్రకటిస్తేగానే శశిపెరుమాళ్ శవాన్ని స్వాధీనం చేసుకునేది లేదని ఆయన బంధువులు ప్రతిజ్ఞ చేయడంతోపాటూ ఆందోళనకు దిగారు.
ఇదిలా ఉండగా, మద్యనిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ శశిపెరుమాళ్ కుటుంబ సభ్యులు సేలం గాంధీ విగ్రహం ముందు ఆదివారం నిరాహారదీక్ష ప్రారంభించారు. శశిపెరుమాళ్ అకాల మరణానికి ప్రభుత్వ వైఖరే కారణమంటూ ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. ఈనెల 4వ తేదీ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో శశిపెరుమాళ్ స్వగ్రామానికి చెందిన ప్రజలు, సేలంలోని అన్ని పార్టీల కార్యకర్తలు పాత బస్స్టేషన్ సమీపంలోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు నిరవధిక నిరాహారదీక్ష చేపట్టేందుకు పోలీసులను అనుమతి కోరారు. నిషేదాజ్ఞలు అమలులో ఉన్నందున దీక్షలకు అనుమతి నిరాకరించారు.
నిషేదాజ్ఞలు మీరి దీక్షలు ప్రారంభిస్తారనే అనుమానంతో ఉదయం 7 గంటలకే గాంధీ విగ్రహం వద్ద పోలీసులు మోహరించారు. ఉదయం 8.30 గంటలకు శశిపెరుమాళ్ చిత్రపటంతో ఆందోళనకారులు ఊరేగింపుగా బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. అలాగే మరోవైపు నుంచి ఉదయం 10.30 గంటలకు ఎండీఎంకే తదితర పార్టీలు, ప్రజా సంఘాలు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి, శశిపెరుమాళ్ చిత్రపటంపై పూలువేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మద్యనిషేధం కోరుతూ నినాదాలు సాగించారు. పోలీసులు వారిని అడ్డుకుంటున్న తరుణంలో శశిపెరుమాళ్ భార్య మగిళం, కుమారుడు నవీందన్, పదేళ్ల వయస్సుగల కుమార్తె కవియరసి అక్కడికి చేరుకుని నిరవధిక నిరాహారదీక్ష ప్రారంభించారు. నిషేదాజ్ఞలు మీరి నిరాహారదీక్షలు చేపట్టారంటూ శశిపెరుమాళ్ కుమారుడు, కుమార్తె సహా 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మద్యనిషేధం కోసం నిరాహారదీక్ష
Published Mon, Aug 3 2015 2:50 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement