ఆర్కేనగర్ నుంచి శశికళ పోటీ! | Sakshi
Sakshi News home page

ఆర్కేనగర్ నుంచి శశికళ పోటీ!

Published Fri, Dec 9 2016 4:09 AM

ఆర్కేనగర్ నుంచి శశికళ పోటీ! - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని దక్కించుకునేందుకు జయ లలిత నెచ్చెలి శశికళ రంగం సిద్ధం చేసుకుం టున్నట్లు సమాచారం. దీనికి ముందే దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిథ్యం వహిం చిన చెన్నై ఆర్కేనగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందాలని కూడా ఆమె భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.  
 
 

శశికళతో పన్నీర్ మంతనాలు: సీఎం పన్నీర్ సెల్వం, సీనియర్ మంత్రి ఎడపాడి పళనిస్వామి తదితరులు గురువారం ప్రస్తుతం శశికళ బంగ్లా గా మారిపోయిన పోయెస్ గార్డెన్ వెళ్లారు. సుమారు రెండున్నర గంటలపాటు ఆమెతో చర్చలు జరిపారు. ఆర్కేనగర్ ఉప ఎన్నిక, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి, భారతీయ జనతా పార్టీ జోక్యం  అంశాలు చర్చకు వచ్చినట్లు విశ్వస నీయ వర్గాల సమాచారం. పార్టీనే కాదు ప్రభుత్వం కూడా శశికళ కనుసన్నల్లోనే నడుస్తున్న వాస్తవాన్ని పోయెస్ గార్డెన్‌కు రావడం ద్వారా పన్నీర్ సెల్వం ధ్రువీకరించారని అంటున్నారు.

Advertisement
Advertisement