రజనీ సహా పలువురు నటులకు పోలీసు భద్రత!! | Sakshi
Sakshi News home page

రజనీ సహా పలువురు నటులకు పోలీసు భద్రత!!

Published Mon, Sep 12 2016 6:28 PM

రజనీ సహా పలువురు నటులకు పోలీసు భద్రత!! - Sakshi

కావేరీ జలాల విషయంలో చెలరేగిన వివాదం.. రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు రగిల్చింది. కర్ణాటక.. తమిళనాడు రెండు రాష్ట్రాల్లోనూ అవతలి రాష్ట్రం వారిపై దాడులు జరుగుతున్నాయి. టీఎన్ అనే రిజిస్ట్రేషన్ ఉన్న వాహనం కనిపిస్తే చాలు... కర్ణాటకలో తగలబెట్టేస్తున్నారు. కార్లను రోడ్లమీదే తిరగేస్తున్నారు. అటు తమిళనాడులో కూడా కన్నడ హోటళ్లపైనా దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో పలువురు నటులకు పోలీసులు భద్రత పెంచారు.

కన్నడ నేపథ్యం కాస్తో కూస్తో ఉన్నా కూడా అలాంటి నటులపై దాడులు జరిగే ప్రమాదం ఉందన్న సమాచారంతో ముందుజాగ్రత్త చర్యగా రజనీకాంత్, ప్రభుదేవా, రమేష్ అరవింద్, బాబీసింహాలకు పోలీసులు రక్షణ కల్పించారు. వీరిలో రజనీకాంత్ నిజానికి మహారాష్ట్రలో పుట్టారు. కర్ణాటకలో కొన్నాళ్లు ఉండేవారు. తర్వాత చెన్నైలో స్థిరపడ్డారు. ప్రభుదేవా పుట్టింది కర్ణాటకలో అయినా తెలుగు, తమిళ సినిమాలతోనే ఎక్కువగా ప్రాచుర్యం పొందారు. అలాగే రమేష్ అరవింద్, బాబీ సింహాలకు కూడా కన్నడ సినిమాలలో చేసిన నేపథ్యం ఉంది. దాంతో వీరిపై దాడులు జరగకుండా చూసేందుకు పోలీసులు భద్రత పెంచారు.

Advertisement
Advertisement