బాబు వల్లే టీడీపీ అధికారంలోకి రాలేదు : ఎంపీ జేసీ | Sakshi
Sakshi News home page

బాబు వల్లే టీడీపీ అధికారంలోకి రాలేదు : ఎంపీ జేసీ

Published Tue, Dec 20 2016 4:28 PM

బాబు వల్లే టీడీపీ అధికారంలోకి రాలేదు : ఎంపీ జేసీ - Sakshi

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో మంగళవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లే టీడీపీ అధికారంలోకి రాలేదని చెప్పారు. పిలిస్తే జనం వచ్చేయడానికి చంద్రబాబు గాంధీ మహాత్ముడు కాదన్నారు.

సీఎం చంద్రబాబు ఆఫీసర్లతో పాలన కొనసాగిస్తున్నారని, ఇప్పటికైనా సీఎం తీరు మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని జేసీ సూచించారు. ఆఫీసర్ల రాజ్యం వద్దని బాబుకు చాలాసార్లు చెప్పానన్నారు. పయ్యావుల కేశవ్లాంటి నాయకులకే పార్టీలో గుర్తింపు లేకపోతే తమ వంటి వాళ్ల పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ జేసీ వ్యాఖ్యలు పార్టీలో గుబులు రేపుతున్నాయి. దీనిపై ఆయన వ్యతిరేక వర్గం సీఎం చంద్రబాబు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ దృష్టికి తీసుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement