ప్రభుత్వ పాలనా యంత్రాంగాన్ని ప్రజలకు మరింత చేరువగా తీసుకుపోవడం వలన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలన్నీ అవినీతిరహితంగా సమర్థవంతంగా అమలు జరుగుతాయని ప్రభుత్వం చెబుతున్నది. అలా జరిగిన నాడు మన పల్లెలు మళ్లీ కళకళలాడుతాయి. కొత్త జిల్లా కేంద్రాల చుట్టూ పట్టణీకరణ జరిగి ఉపాధి అవకాశాలు పెరిగితే వలసలకు అడ్డుకట్ట పడుతుంది. ప్రాణాలు బలి పెట్టుకోవలసిన పరిస్థితులూ పోతాయి. ఇప్పటికే మండల స్థాయిలలో నాయకత్వం వహించగలుగుతున్న వెనుకబడిన సమూహాల నుంచి జిల్లా స్థాయి నాయకత్వం ఎదిగిరాగల అవకాశాలు పెరుగుతాయి. ఈ లక్ష్యాల సాధనకు జిల్లాల పెంపు కార్యక్రమం బాటలు వేయాలని ఆశిద్దాం.