సాక్షి, ముంబై: నగరంలో తెలంగాణ భవన్ నిర్మించేందుకు సహకరించాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ర చంద్రశేఖర్రావును తెలంగాణ ఉద్యమ సంఘీబావ వేదిక సభ్యులు కోరారు. ఈ మేరకు హైదరాబాద్లోని లేక్వ్యూ అతిధిగృహంలో ఆయనతో శనివారం భేటీ అయ్యారు. తెలంగాణ అద్భు త విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. జూన్ రెండో తేదీన తెలంగాణ రాష్ట్రానికి తొలిముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న కేసీఆర్కు వలసబిడ్డల సాధకబాదలతోపాటు పలు డిమాండ్లను వివరించారు.
ముంబైలో తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ భవనం నిర్మించాలని, దీర్ఘకాలిక ఉపాధి కల్పించి వలసలు జరగకుండా చూడాలని కోరారు. ముంబైతోపాటు మహారాష్ట్రలో ఉండే తెలంగాణ విద్యార్థులకు కుల ధ్రువీకరణ ఆదాయపు పత్రాలు, ఇతర విషయల్లో సహకరించాలని అభ్యర్థించారు. ప్రధానంగా ఎన్నో ఏళ్లుగా కలలు కన్న కల సాకారం అవుతున్న నేపథ్యంలో ముంబైలో స్థిరపడ్డ తెలంగాణ వలసబిడ్డలకు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు రవాణా, ఇతర విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ విషయాలన్నింటికి కేసీఆర్ ఎంతో ఓపిగ్గా విని సానుకూలం గా స్పందించారని తెలంగాణ ఉద్యమ సంఘీబావ వేదిక బృందం సభ్యులు పేర్కొన్నారు. కేసీఆర్తో భేటీ అయి న వారిలో వేదిక కన్వీనర్లు గ్యారా శేఖ ర్, గోండ్యాల రమేష్, సింగపం గ సైదులు, స్వామి యాదగిరి, బత్తుల లింగం ఉన్నారు.
సంబరాలు చేసుకుంటాం
జూన్ రెండో తేదీ నుంచి అధికారికంగా ప్రత్యేక తెలంగాణ ఉనికిలోకి రానున్న నేపథ్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ముంబైతోపాటు మహారాష్ట్రలోని వలసబిడ్డలందరు జరుపుకోవాలని తెలంగాణ ఉద్యమ సంఘీబావ వేదిక పిలుపునిచ్చింది. తెలంగాణ ఉద్యమ సంఘీబావ వేదిక ఆధ్వర్యంలో ముంబైతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలంగాణ అవతరణ దినోత్సవాలను నిర్వహిస్తుందని కన్వీనర్లు అక్కనపెల్లి దుర్గేష్, వెంకటేష్, మచ్చప్రభాకర్లు పేర్కొన్నారు.
బాబును కలసిన ఆంధ్ర మహాసభ సభ్యులు
తెలుగు సంస్థలకు మాతృసంస్థగా విరాజిల్లుతున్న ఆంధ్ర మహాసభకు రావాలని ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడిని ఆహ్వానించామనిది బొంబాయి ఆంధ్ర మహాసభ అండ్ జింఖానా’ అధ్యక్షుడు సంకు సుధాకర్ తెలిపారు. హైదరాబాద్లోని టీడీపీ పార్టీ కార్యాల యంలో చంద్రబాబును ఆయ న భేటీ అయ్యారు. సీమాంధ్ర ఎన్నికల్లో విజయం సాధించిన బాబుకు అభినందనలు తెలిపారు. అనంతరం ముంబైలోని తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.
తెలుగువారి కోసం పని చేస్తున్న వివిధ సంస్థల గురించి తెలిపారు. ఆంధ్ర మహాసభకు సంబంధించి ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన వార్తను చూపించారు. అనంతరం తెలుగు సంస్థలకు మాతృసంస్థగా విరాజిల్లుతున్న ఆంధ్ర మహాసభకు రావాలని ఆహ్వానం పలికారు. దీనికి ఆయన కూడా సానుకూలంగా స్పందిం చారని, 2014 డిసెంబర్లోపు ఆంధ్ర మహాసభకు వస్తానని హామీ ఇచ్చారని సంకు సుధాకర్ తెలిపారు. చంద్రబాబును కలిసిన వారిలో ఆంధ్ర మహాసభ సభ్యుడు సత్యం కూడా ఉన్నారు.
తెలంగాణ భవన్ నిర్మించండి
Published Sat, May 24 2014 11:07 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement