ప్రమాదాల సంవత్సరం | Sakshi
Sakshi News home page

ప్రమాదాల సంవత్సరం

Published Fri, Jan 2 2015 2:34 AM

ప్రమాదాల సంవత్సరం - Sakshi

2014లో పలు ప్రమాదాలు
మొత్తం 130 మంది మృతి


హొసూరు:  రోడ్డు ప్రమాదాలలో 2014వ సం వత్సరంలో మాత్రమే హొసూరు ప్రాంతంలో 130 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలి పారు. క్రిష్ణగిరి జిల్లా హొసూరు పట్టణ,  హ డ్కో, సిఫ్‌కాట్, మత్తిగిరి  పోలీస్‌స్టేషన్ పరిధు ల్లో మాత్రమే  2014వ సంవత్సరంలో  రోడ్డు మ్రాదాల్లో  130 మంది మృతి చెందినట్లు పోలీ సులు తెలిపారు.

గత 2013వ సవత్సరం ఈ పోలీస్‌స్టేషన్ పరిధుల్లో 100 మంది మాత్రమే ప్రమాదాలకు గురై మృతి చెందారని, ఈ సంవత్సరం 30 శాతం పెరిగిందని, నెలకు సరాసరి 10 నుంచి 11 మంది మృతిచెందారని తెలిపా రు.  లారీల వల్లే ఈ ప్రమాదాలన్నీ జరిగాయన్నారు. ప్రతి సంవత్సరం ప్రమాదాలలో మృతి చెందేవారి సంఖ్య పెరిగిపోతుందని, మద్యం సేవించి వాహనాలు నడపడం, నిబంధనలు పాటించకపోవడమే ఇందుకు కారణమన్నారు.  
 
 

Advertisement
Advertisement