అయ్యో.. గజరాజా | Sakshi
Sakshi News home page

అయ్యో.. గజరాజా

Published Fri, Mar 31 2017 11:50 AM

The elephant was found dead in a pitiful situation

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆకలి తీర్చుకునే ప్రయత్నంలో ఓ గజరాజు దయనీయ స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన  తమిళనాడులో చోటుచేసుకుంది. కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళయం సమీపంలో పనస తోటలు ఉన్నాయి. వాటిని తినేందుకు ఓ ఏనుగు ఈ నెల 29న రాత్రి తోటలోకి వెళ్లింది. పనస కాయను తొండంతో అందుకునేందుకు ఏనుగు ముందుకాళ్లను పైకెత్తగా అదు పు తప్పి చెట్టు మధ్యలో కుడికాలు ఇరుక్కుంది. కాలు లాక్కునే ప్రయత్నంలో తలకిందులుగా పడడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడే ప్రాణాలు విడిచింది.


 

Advertisement
Advertisement