♦ శశికళ పిటిషన్పై ప్రతిష్టంభన
♦ కొత్త న్యాయమూర్తి నియామకం తరువాతనే విచారణ
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని పేర్కొంటూ దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ, సుధాకరన్లపై అవినీతి నిరోధకశాఖ 1996లో కేసు పెట్టింది. ఈ కేసు అనేక దశల తరువాత బెంగళూరులోని ప్రత్యేక కోర్టుకు చేరగా, ఈ నలుగురికి న్యాయమూర్తి నాలుగేళ్ల జైలుశిక్ష, అలాగే జయలలితకు రూ.100 కోట్లు, మిగిలిన ముగ్గురికి తలా రూ.10 కోట్ల జరిమానా విధించారు. ఈ తీర్పు ప్రకారం కొద్దిరోజులు జైలుశిక్షను అనుభవించిన జయలలిత ఆ తరువాత బెయిల్పై బైటకు వచ్చి కర్ణాటక హైకోర్టులో అప్పీలు చేశారు.
నలుగురు నిర్దోషులంటూ హైకోర్టు తీర్పుచెప్పడంతో విముక్తులయ్యారు. అయితే ఈ తీర్పును కర్ణాటక ప్రభుత్వం, డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్బళగన్ వేరువేరుగా సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ కేసును న్యాయమూర్తులు పినాకీ చంద్రఘోష్, అమిత్వరాయ్ల ముందుకు ఆనాడు విచారణకు వచ్చింది. నాలుగేళ్ల జైలు శిక్ష, జరిమానాగా బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన న్యాయమూర్తులు తీర్పు చెప్పారు. జయలలిత కన్నుమూయడంతో ఆమెకు విధించిన శిక్షను రద్దు చేయగా, శశికళ, ఇళవరసి, సుధాకరన్ బెంగళూరు జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. ఇదిలా ఉండగా, సదరు తీర్పును పునఃపరిశీలించాల్సిందిగా కోరుతూ ఈ ముగ్గురు సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకున్నారు. ఆస్తుల కేసులో ప్రధాన నిందితురాలు జయలలిత మృతి, నిర్దోషులుగా పేర్కొంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకోవాలని అప్పీలు పిటిషన్లో కోరారు.
ఈ అప్పీలు పిటిషన్ బుధవారం కోర్టు ముందుకు రాగా, న్యాయమూర్తులు రోగిందన్ పాలినారిమన్, అమిత్తవరాయ్ విచారించాల్సి ఉంది. అయితే ఈ పునఃపరిశీలన పిటిషన్ను విచారించడం సబబు కాదని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన న్యాయ సలహాదారు ముకుల్ రోహిత్కీ న్యాయమూర్తి రోగిందన్ పాలినారిమన్ను మంగళవారం రాత్రి కలిసినట్లు సమాచారం. రోగిందన్ తండ్రి పాలిమన్ నారిమన్ గతంలో జయలలిత ప్రత్యేక న్యాయవాదిగా వ్యవహరిస్తూ అనుకూలంగా వాదించి ఉన్నందున ఈ పిటిషన్పై విచారణ జరపడం భావ్యం కాదని రోహిత్కీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా, సుప్రీం కోర్టులో బుధవారం విచారణకు వచ్చే పిటిషన్ల జాబితాలో శశికళ పిటిషన్ చోటు చేసుకోలేదు. అంతేగాక న్యాయమూర్తి రోగిందన్ పాలినారిమన్ విచారణ నుంచి అకస్మాత్తుగా తప్పుకున్నారు. రోహిత్కీ అభ్యర్థన మేరకే న్యాయమూర్తి తప్పుకున్నట్లు సమాచారం. దీంతో కొత్త న్యాయమూర్తి నియామకం తరువాతనే శశికళ పిటిషన్పై విచారణ జరగనుంది.
చిన్నమ్మలుపు
Published Thu, Aug 3 2017 5:03 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement