షోలాపూర్, న్యూస్లైన్: అతనొక రాజకీయ నాయకుడు.. అందులోనూ కుమార్తె వివాహం.. ఇక పెళ్లి ఏర్పాట్లు ఏ స్థాయిలో ఉంటాయో మీరే ఊహించుకోవచ్చు.. ఆగండాగండి.. మీరు ఊహిస్తున్నట్లు ఆయన తన కుమార్తె పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించలేదు.. కేవలం నిశ్చితార్థం ఖర్చులోనే పెళ్లి జరిగిందనిపించేశాడు.. అయినా అతడిని ఎవరూ తిట్టుకోలేదు.. పిసినారి అని అనలేదు.. ఎందుకో తెలుసా.. పెళ్లికోసం ఖర్చు పెట్టాల్సిన సొమ్మును అతడు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశాడు.. అదీ అక్కడి విశేషం..!
వివరాల్లోకి వెళితే.. బాలాసాహెబ్ మోరే మరాఠ్వాడాలోని అకుల్కోట్ పంచాయితీ సమితి ప్రతిపక్ష నేత. ఆయన తన కుమార్తె సౌజన్యకు చంద్రకాంత్ క్షీరసాగర్తో వివాహం నిశ్చయించారు. ఈ మేరకు బుధవారం పట్టణంలోనే నిశ్చితార్థం పెట్టుకున్నారు. జనవరి 29వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. సాధారణంగా నిశ్చితార్థం, వివాహం ఇలా రెండు వేడుకలకూ అదే బంధువులను ఆహ్వానిస్తారు.
దీంతో రెండుసార్లు వేడుకల కోసం ఖర్చుపెట్టే సొమ్ములో కొంత పొదుపు చేసి ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయాలని మోరే సంకల్పించగా, వరుడి తరఫు వారు సైతం అంగీకరించారు. దీంతో పెళ్లి సమయంలో వేడుకలను రద్దుచేయాలని నిశ్చయించారు.
ఆ రోజు ఖర్చు రూ.లక్షా వెయ్యి రూపాయలుగా తేలడంతో సదరు మొత్తాన్ని నిశ్చితార్థం సమయంలోనే చెక్కు రూపంలో స్థానిక తహశీల్దార్కు అందజేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
ఈ సందర్భంగా బాలాసాహెబ్ మోరే మాట్లాడుతూ.. ప్రస్తుతం తీవ్ర క్షామంతో అల్లాడుతున్న మరాఠ్వాడాను ఆదుకునేందుకు తమ వంతు సాయంగా ఈ మొత్తాన్ని సీఎం సహాయ నిధికి అందజేశామన్నారు. వృథా ఖర్చులు తగ్గించుకుని, ఆ సొమ్మును కరువు బారిన పడిన రైతులను ఆదుకునేందుకు అందజేయాలనే సంకల్పంతోనే ఈ పనికి పూనుకున్నామని చెప్పారు.
పెళ్లి ఖర్చులు సీఎం సహాయ నిధికి..
Published Sat, Dec 6 2014 10:22 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
వైఎస్ జగన్ కోసం రెండు నెలలుగా ప్రార్థనలు
ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచుతున్న రాహుల్
పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించాలి
ప్రజాస్వామ్యాన్నిపరిరక్షించుకోవాలి
పోలింగ్ రోజున ‘ర్యాపిడో’ ఉచిత సేవలు
వడివడిగా ఈవీఎం కమిషనింగ్ పనులు
గౌడ అభ్యర్థులను గెలిపించండి
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement