ఒకే కుటుంబంలో ముగ్గురు దారుణ హత్య | Sakshi
Sakshi News home page

ఒకే కుటుంబంలో ముగ్గురు దారుణ హత్య

Published Tue, Nov 29 2016 12:38 AM

ఒకే కుటుంబంలో ముగ్గురు దారుణ హత్య

వేలూరు: తిరుపత్తూరు సమీపంలో సోమవారం ఉదయం విద్యుత్ శాఖ అధికారి, అతని భార్య, కుమార్తెను గొంతు కోసి హత్య చేసిన సంఘటన సంచలనం కలిగించింది. వివరాలు.. వేలూరు జిల్లా తిరుపత్తూరు సమీపంలో కాకంగరై గ్రామానికి చెందిన మోహన్(52) కందిలిలోని విద్యుత్ శాఖలో లైన్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య రాజేశ్వరి(45), కుమార్తె సుకన్య(23), కుమారుడు తమిళరసన్. కుమా ర్తె, కుమారుడు బెంగళూరులో ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సుకన్య, తమిళరసన్ ఇంటికి వ చ్చారు. ఈ నేపథ్యంలో మోహన్ ఆదివారం రాత్రి విధులు ముగించుకొని సోమవారం ఉదయం 5.30 గంటలకు ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇంటి తలుపులు తెరచి ఉండడంతో ఆందోళనతో లోపలికి వెళ్లి చూడగా భార్య రాజేశ్వరి, కుమార్తె సుకన్య  గొంతు కోసిన స్థితిలో రక్తపు మడుగులో విగతజీవులుగా కనిపించారు. 
 
ఇంట్లో దాగి ఉన్న దుండగులు మోహన్‌ను కత్తితో పొడిచి, గొంతు కోసి పరారయ్యారు. అతడు కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు గమనించి రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలను చూసి దిగ్భ్రాంతి చెందారు. చెయ్యి, వీపుపై గాయాలతో కొట్టుమిట్టాడుతున్న తమిళరసన్‌ను అంబులెన్‌‌సలో తిరుపత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై సమాచారం అందుకున్న కందిలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టంకు పంపారు. డాగ్ స్క్వాడ్‌ను రప్పించి పరిశీలించారు. అనంతరం స్వల్ప గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళరసన్ వద్ద విచారణ జరిపారు. అతడు పొంతనలేని సమాధానాలివ్వడంతో విచారణ వేగవంతం చేశారు. తమిళరసన్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న కంపెనీ వివరాలను గురించి తెలపకపోవడం గమనార్హం.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement