సాక్షి, చెన్నై: రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి డి సబిత మద్రాసు హైకోర్టుకు క్షమాపణలు చెప్పుకున్నారు. అంధుల విషయంలో జరిగిన తప్పును సరిదిద్దుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంధులూ మనుషులేనని, నిబంధనలు ఉల్లంఘించడం ఉన్నత స్థాయిలోని అధికారులకు పరిపాటిగా మారిందని ప్రధాన బెంచ్ అసహనం వ్యక్తం చేసింది. 2009లో పాఠశాల విద్యా శాఖ 195 పోస్టుల భర్తీ నిమిత్తం ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అంధులు అర్హులు కారని స్పష్టం చేస్తూ ప్రత్యేకంగా ఆ నోటిఫికేషన్లో పొందు పరిచిన అంశాలు వివాదాస్పదమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల మేరకు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లో అంధులకు మూడు శాతం కేటాయించాల్సి ఉంది. ఇందుకు విరుద్ధంగా నోటిఫికేషన్ వెలువడడంతో అంధుల సంఘం మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ విచారణ లో భాగంగా గత వారం విద్యా శాఖ ప్రధాన కార్యదర్శి సబిత తరపున ఇచ్చిన వివరణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సుందరేషన్ నేతృత్వంలోని బెంచ్కు ఆగ్రహాన్ని తెప్పించింది.
ఆగ్రహం : అంధుల పిటిషన్కు వివరణ ఇస్తూ దాఖలైన రిట్ పిటిషన్లో విద్యాశాఖ అధికారులు చేసిన తప్పులు ఆ శాఖ ప్రధాన కార్యదర్శి సబితకు చుట్టుకుంది. ఆ పోస్టుల భర్తీ గురించి వివరిస్తూ, ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. అయితే, విద్యార్థులకు అర్థం అయ్యే రీతిలో బోధించాల్సిన ఆ పోస్టులకు అవసరమయ్యే వారు ఎలాంటి అవయవలోపం లేని వాళ్లుగా ఉండాలని పేర్కొన్నారు. . అయితే, అంధులు, చెవిటి వాళ్లను నియమిస్తే, ఇబ్బందులు ఎదురు అవుతాయని, అందుకే తమ నోటిఫికేషన్లో అలాంటి వారు అనర్హులుగా స్పష్టం చేశామని ఇచ్చిన వివరణ హైకోర్టుకు ఆగ్రహం తెప్పించింది. ఇదేనా అంధుల విషయంలో వ్యవహరించే విధానం, ఇదేనా రిట్ పిటిషన్ ద్వారా ఇచ్చే వివరణ అని తీవ్ర ఆక్షేపణను వ్యక్తం చేశారు. ఈ సమస్యను తాము వదలి పెట్టే ప్రసక్తే లేదని ఆ శాఖ ప్రధాన కార్యదర్శి కోర్టుకు రావాలని ఆదేశించారు.
సారీ : బుధవారం ఈ పిటిషన్ విచారణకు రాగా, విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి సబిత కోర్టుకు హాజరు కావడంతో పాటుగా క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది. నిబంధనల మేరకు క్షమాపణ చెబుతూ పిటిషన్ సైతం దాఖలు చేశారు. దీనిని అడ్వకేట్ జనరల్ సోమయాజులు ప్రధాన న్యాయమూర్తి బెంచ్కు అందజేశారు. రిట్ పిటిషన్లో జరిగిన పొరబాటు, తప్పును సరిదిద్దుకుంటామని పేర్కొన్నారు. ఇందుకు స్పందించిన బెంచ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, కొన్ని వ్యాఖ్యల్ని చేసింది. అంధులూ మనుషులేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఇప్పటి వరకు భర్తీ చేసిన పదవులు ఎన్ని, ఖాళీలు ఎన్ని తదితర వివరాల్ని వెల్లడించాల్సి ఉందన్నారు. తప్పులను చేయడం పరిపాటిగా మారిందని అసహనం వ్యక్తం చేశారు. బాధ్యత గల పదవిలో ఉన్న వాళ్లు తప్పులు చేయొచ్చా..? అని ప్రశ్నించారు. ఉన్నత పదవిలో ఉన్న వాళ్లే ఎక్కువగా నిబంధనల్ని ఉల్లంఘిస్తారని అసహనం వ్యక్తం చేస్తూ, పిటిషన్ విచారణను ముగించారు.
ఐ యామ్ సారీ
Published Thu, Apr 2 2015 2:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement