నేడు పలుచోట్ల వైస్సార్ వర్ధంతి | Sakshi
Sakshi News home page

నేడు పలుచోట్ల వైస్సార్ వర్ధంతి

Published Sun, Sep 1 2013 11:11 PM

today ysr anniversary

సాక్షి, ముంబై: దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి నా లుగో వర్ధంతిని పురస్కరించుకుని సోమవా రం నగరం, శివారు ప్రాంతాల్లో ఆయన అభిమానులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా రు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముంబైశాఖ నాయకులు మాదిరెడ్డి కొండారెడ్డి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరగనున్నా యి. సాయంత్రం ఆరు గంటలకు కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించి, విద్యార్థులకు నో టు పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. అనంతరం చంద్రమణి బుద్ధవిహార్ హాలు, జీజామాతానగర్, తూర్పు గోరేగావ్‌లో వర్ధంతి సభలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి యాంకర్‌గా సాక్షిటీవీ సిల్లీబ్రాండ్ నిర్వాహకుడు మిమిక్రీ రమేశ్ వ్యవహరిస్తారని కొండారెడ్డి ఒక ప్రకటనలో చెప్పారు. గోరేగావ్‌లోని ఆంధ్ర ప్రజాసంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు కూడా నిర్వహిస్తారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement