నోట్ల మార్పిడి కేసులో ఇద్దరి లొంగుబాటు | Sakshi
Sakshi News home page

నోట్ల మార్పిడి కేసులో ఇద్దరి లొంగుబాటు

Published Wed, Dec 14 2016 8:31 PM

Two arrested in kurnool over exchange of notes on commission

కర్నూలు: నోట్ల మార్పిడి కేసులో పరారీలో ఉన్న ముఠా సభ్యుల్లో ఇద్దరు బుధవారం కర్నూలులో లొంగిపోయారు. వెలుగోడు పోలీస్ స్టేషన్‌ ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కథనం మేరకు ఈనెల 9న నోట్లు మార్పిడి కోసం ప్రయత్నిస్తూ ఆత్మకూరు పోలీసులకు సంజీవగౌడ్, రవితేజారెడ్డి పట్టుబడ్డారు.

ప్రసాద్, సుధాకర్ అనే నిందితులు పరారీలో ఉండగా వారు బుధవారం వెలుగోడు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ కేసులో ఇంకా కృష్ణారెడ్డి, ఆంజనేయులు దొరకాల్సి ఉందని ఆయన తెలిపారు. లొంగిపోయిన ఇద్దరిని ఆత్మకూరు కోర్టులో హాజరుపర్చినట్లు చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement