ఆర్టీసీ బస్సులు ఢీ : ప్రయాణికులకు గాయాలు | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సులు ఢీ : ప్రయాణికులకు గాయాలు

Published Wed, Aug 24 2016 7:49 PM

two rtc buses clash in khammam district

ఖమ్మం: రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటనలో ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం పల్లిపాడులో బుధవారం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానినొకటి ఢీకొనడంతో.. ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. భారీ వర్షం వస్తుండటంతో.. ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement