సాక్షి ప్రతినిధి, బెంగళూరు :నగరంలోని తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 29న ఇక్కడి ఫ్రీడం పార్కులో ఆంధ్రప్రదేశ్ విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సమైక్య గర్జనను నిర్వహిస్తున్నట్లు తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డాక్టర్ ఏ. రాధాకృష్ణ రాజు, కర్ణాటక తెలుగు ప్రజా సమితి అధ్యక్షుడు బొందు రామస్వామి తెలిపారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు సమైక్య గర్జనను నిర్వహిస్తామని వెల్లడించారు. ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ను సమైక్యంగానే ఉంచాలంటూ ఏక వాక్య తీర్మానం చేయనున్నట్లు చెప్పారు. తీర్మాన ప్రతులను రాష్ట్రపతి, ప్రధానిలకు పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి నగరంలోని ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. కాగా ఈ సమైక్య గర్జనకు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్ సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై అన్ని రాష్ట్రాల్లోని తెలుగు వారు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని తెలిపారు. తెలుగు వారు తల ఎత్తుకుని తిరిగే పరిస్థితి లేదని వాపోయారు. విభజనను శాస్త్రీయంగా కాకుండా రాజకీయంగా చేసినందునే ఈ పరిస్థితి ఉత్పన్నమైందన్నారు. ఈ పరిణామాలకు కాంగ్రెస్ వాడిగా సిగ్గు పడుతున్నానని చెప్పారు. ఏదేమైనా విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో తెలుగు విజ్ఞాన సమితి ప్రధాన కార్యదర్శి ఏకే. జయచంద్రా రెడ్డి, కోశాధికారి సీవీ. శ్రీనివాసయ్య పాల్గొన్నారు
29న సమైక్య గర్జన
Published Wed, Sep 25 2013 4:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement