నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణం కోసం నిధిని సమకూర్చడంలో భాగంగా సంఘ నిర్వాహకులు ఇటీవల స్టార్స్ క్రికెట్ క్రీడా పోటీలను నిర్వహించిన విషయం తెలిసిందే.అయితే ఆ కార్యక్రమంపై పలు రకాల విమర్శలు, ఆరోపణలు రావడం గమనార్హం.ప్రముఖ నటుడు అజిత్ స్టార్స్ క్రికెట్ క్రీడా పోటీలను బహిష్కరించారని, సంఘం భవన నిర్మాణ నిధికి ఇలాంటి కార్యక్రమాలు అనవసరం అన్న భావనను వ్యక్తం చేశారనే ప్రచారం కలకలం సృష్టిస్తోంది.
అంతే కాదు ఈ విషయంలో సంఘం కార్యదర్శి విశాల్కు, అజిత్కు మధ్య విభేదాలు తలెత్తాయనే ప్రచారం జోరందుకుంది.కాగా స్టార్స్ క్రికెట్ క్రీడాపోటీలు విజయవంతంగా జరిగిన నేపధ్యంలో నడిగర్ సంఘం కార్యవర్గం బుధవారం సక్సెస్ మీట్ను నిర్వహించింది.ఈ సమావేశంలో పాల్గొన్న సంఘం కోశాధికారి నటుడు కార్తీ మాట్లాడుతూ ఇది ఏ ఒక్కరికి చెందిన కార్యక్రమం కాదనీ సంఘం భవన నిర్మాణం,అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమం అనీ అన్నారు. దీని కోసం సంఘం లోని ప్రతి సభ్యుడు శ్రమించాడని వారందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. ఒక ప్రశ్నకు బదులిస్తూ సంఘం భవన నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయని, ఆర్కెటిక్ను నియమించామని,ప్లాన్ కూడా సిద్ధమైందని, ఇక అప్రూవల్ అవడమే ఆలస్యం అని తెలిపారు.
శంకుస్థాపన ఎప్పుడన్న ప్రశ్నకు భవన నిర్మాణానికి మొత్తం రూ.28 కోట్లు ఖర్చు అవుతుందని ఇప్పటికి సేకరించిన నిధితో ఆరు నెలలు మాత్రమే నిర్మాణ పనులు సాగుతాయని అందువల్ల మధ్యలో పని ఆగిపోకుండా పూర్తిగా నిధి సేకరించిన తరువాతనే నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు,కాగా నటుడు అజిత్ వ్యాఖ్యలపై స్పందిచాల్సిందిగా సంఘం కార్యదర్శి విశాల్ను అడగ్గా అజిత్కు తనకు మధ్య ఎలాంటి విభేదాల్లేవని స్పష్టం చేశారు.నిజానికి అజిత్ విమర్శించినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు.
అయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదనీ,కొందరు కావాలనే వదంతులు సృష్టించి సమస్యగా మార్చాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు.అజిత్ స్టార్స్ క్రికెట్ క్రీడా పోటీల్లో పాల్గొనక పోవడం అన్నది ఆయన వ్యక్తిగత విషయమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. దాన్ని తాను స్వాగతిస్తున్నానని విశాల్ అన్నారు. నటుడు శింబు వ్యవహారం గురించి స్పందిస్తూ ఆయన తమ సభ్యుల్లో ఒకరని,శింబు సంఘం నుంచి వైదొలగాలని తాము కోరుకోవడం లేదని అన్నారు.తమ ఏకైక లక్ష్యం సంఘం అభివృద్ధేనన్నారు. మీడియాలో కొన్ని అవాస్తవ ప్రచారాలు జరుగుతున్నాయని పాత్రికేయ మిత్రులు అలాంటి వాటిని అడ్డుకోవాలని విశాల్ విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడు నాజర్, ఉపాధ్యక్షుడు పోన్వన్నన్ పాల్గొన్నారు.
అజిత్తో నాకెలాంటి విభేదాల్లేవు
Published Thu, Apr 28 2016 2:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement