సాక్షి, న్యూఢిల్లీ: నీటి చార్జీలను 10 శాతం మేర పెంచాలని ఢిల్లీ జల్ బోర్డు(డీజేబీ) నిర్ణయించింది. కానీ, ఈ చార్జీల పెంపును అందరికీ కాకుండా నెలకు 20 వేల లీటర్లకు పైగా నీటిని వినియోగించే కుటుంబాలకు వర్తింపు చేయాలని డీజేబీ భావిస్తోంది. కుటుంబానికి నెలకు 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా అందిస్తామన్న హామీతో ఆప్ ఆద్మీ పార్టీ(ఆప్) ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. ఆప్ సర్కారు ఏర్పాటు కాగానే ఉచిత నీటి హామీని నిలబెట్టుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కొక్క కుటుంబానికి నెలకు 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా సరఫరా చేస్తామని, అంతకు మించి ఒక్క లీటరును ఎక్కువగా వినియోగించినా పూర్తి చార్జీలను చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
అయితే ఇప్పుడు ఉచిత నీటి సరఫరా వల్ల తగ్గిన ఆదాయన్ని పూడ్చుకోవడం కోసం నీటి చార్జీలను పది శాతం పెంచాలని డీజేబీ నిర్ణయించింది. గురువారం జరిగిన ఢిల్లీ జల్ బోర్డు సమావేశంలో 20 వేల లీటర్లకు పైగా వినియోగించే కుటుంబాల నీటి చార్జీలను 10 శాతం పెంచడంతోపాటు, 250 వాటర ట్యాంకర్లను కొనాలని నిర్ణయించారు. సమావేశంలో ఇతర అంశాలతో పాటు అనధికార కనెక్షన్లను క్రమబద్ధీకరించడంపై కూడా చర్చ జరిగింది. నగరంలోని అక్రమ కనెక్షన్లను క్రమబద్ధీకరించాలని సమావేశం నిర్ణయించింది. రాజధానిలో 23 వేల అక్రమ కనెక్షన్లు ఉన్నాయనేది డీజేబీ అంచనా. కొత్త కనెక్షన్ కోసం డెవలప్మెంట్ చార్జీ వసూలు చేయరాదని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. నీటి కనెక్షన్ల కోసం ప్రభుత్వం త్వరలోనే కొత్త విధానాన్ని తీసుకురానుంది. దీని కింద రూ. 3,500 కొత్త కనెక్షన్ ఇస్తారు.
నీటి చార్జీలను 10 శాతం పెంచనున్న డీజేబీ
Published Thu, Mar 19 2015 10:54 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement