♦ హోం శాఖ సహాయ మంత్రి రంజిత్ పాటిల్
♦ అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికేనని వెల్లడి
♦ ఆరు నెలల్లో కొత్త పాలసీ అమల్లోకి
ముంబై : ఆదాయం కోసం డవలపర్లు ప్రభుత్వ భూములను ఉపయోగించడాన్ని నిరోధించడానికి నౌకాశ్రయ విధానాన్ని (పోర్ట్ పాలసీ) సవరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ‘పోర్టు భూములను అభివృద్ధి చేస్తామని చెప్పి డవలపర్లు పీపీపీ పద్ధతిన బిడ్లు వేసి, ఏళ్లయినా వాటి గురించి పట్టించుకోవడం లేదు. 15- 20 ఏళ్లపాటు ఆ భూములను అంటిపెట్టుకుని తర్వాత అమ్మేస్తారు. ఇలా చేసి భారీ ఆదాయం సంపాదిస్తారు. కానీ ఎలాంటి అభివృద్ధి చేయరు’ అని హోం శాఖ సహాయ మంత్రి రంజిత్ పాటిల్ అన్నారు. పోర్ట్ పాలసీకి సంబంధించి పలు ఏజెన్సీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘పోర్ట్ పాలసీని సవరించాలని ప్రభుత్వం భావిస్తోంది. పోర్టు భూములను సొంతం చేసుకున్న డవలపర్లు నిర్ణీత కాల వ్యవధిలోగా వాటిని అభివృద్ధి చేసేలా సవరణ చేస్తాం. ఒక్క సారి పీపీపీ పద్ధతి ద్వారా స్థలం దక్కించుకున్న డవలపర్లు, తర్వాత అభివృద్ధి చేయడానికి మాత్రం కుంటిసాకులు చూపుతున్నారు. కానీ ఇప్పుడు అలాంటివి చెల్లవు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి ఈ మేరకు అనుమతి తీసుకుంది. భూములను సొంతం చేసుకున్న నిర్ణీత వ్యవధిలోగా అభివృద్ధి చేసి తీరాల్సిందే’ అని పాటిల్ వివరించారు.
ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రారంభ దశలోనే ఉందని, చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. త్వరలోనే డ్రాఫ్టు బిల్లుతో ముందుకొస్తామని పేర్కొన్నారు. ‘ఇప్పటికే భూములను సొంతం చేసుకున్న వారు సైతం వాటి అభివృద్ధి పనులు ప్రారంభించాలి. లేదంటే ఆ భూములను స్వాధీనం చేసుకుంటాం’ అని హెచ్చరించారు. 6 నెలల్లో కొత్త పాలసీ అమల్లోకి తెస్తామని తెలిపారు.
నౌకాశ్రయ విధానాన్ని సవరిస్తాం
Published Sat, Aug 22 2015 3:08 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement