భారతరత్న ప్రొఫెసర్ సి.ఎన్.ఆర్.రావు
బెంగళూరు: నానో టెక్నాలజీని నీటి శుద్ధీకరణలో వినియోగిస్తే దేశంలోని ప్రజలందరికీ పూర్తిగా పరిశుభ్రమైన నీటిని అందజేయవచ్చని ప్రముఖ శాస్త్రవేత్త, భారతరత్న ప్రొఫెసర్ సి.ఎన్.ఆర్.రావు పేర్కొన్నారు. సోమవారమిక్కడ ‘నానో టెక్నాలజీ’ పై నిర్వహించిన సమావేశంలో ఆయ న ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో నీరు రోజురోజుకు కలుషితమైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నీటిలో ఫ్లోరైడ్తో పాటు యురేనియం వంటి కాలుష్యాలు కలుస్తుండడంతో ప్రజల్లో క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులు వ్యాపిస్తున్నాయని తెలిపారు. అందువల్ల న్యా నో టెక్నాలజీ ద్వారా పూర్తిగా శుద్ధమైన నీటిని ప్రజలకు అందజేసేందుకు ఆస్కారం ఉందని అన్నారు. ఇక వ్యవసాయ రంగంలో సైతం న్యానో టెక్నాలజీని వినియోగించడం ద్వారా తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటను పండించవచ్చని పేర్కొన్నారు. విత్తనాలు, ఎరువులు ఇలా అన్నింటా నానో టెక్నాలజీని వినియోగించుకోవచ్చని సూచించారు.
రోజురోజుకు ప్రకృతిలో వస్తున్న మార్పులు, పెరిగిపోతున్న వ్యాధులు, తదితరాలను ఎదుర్కొనడం అంత సులువైన విషయం కాదని, శాస్త్ర, సాంకేతిక రంగంలో సైతం వినూత్న ఆవిష్కరణలు వచ్చినప్పుడే ఈ సమస్యలను ఎదుర్కొనడం సాధ్యమవుతుందని అన్నారు. ఇక ప్రస్తుతం శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి సంబంధించి జపాన్, బ్రిటన్లు మొదటి, రెండవ స్థానాల్లో ఉండగా, భారత్ మూడో స్థానంలో ఉందని పేర్కొన్నారు. కాగా, బెంగళూరు ఇండియా నానో సమ్మేళనం బెంగళూరులోని హోటల్ లలిత్ అశోకాలో మార్చి 3 నుంచి 5వరకు కొనసాగనుందని ఈ సందర్భంగా సి.ఎన్.ఆర్.రావు వివరించారు. ఈ సమావేశంలో 60 మంది శాస్త్రవేత్తలు, బ్రిటన్, అమెరికా, జర్మనీ తదితర దేశాలకు చెందిన 500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని వెల్లడించారు.
నానో టెక్నాలజీతో పరిశుభ్రమైన నీరు
Published Tue, Feb 9 2016 2:07 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రాములమ్మ ఆలోచనలు ఏంటి? కాంగ్రెస్లో కొనసాగుతారా.. లేక?
దిగ్గజ బ్యాంకర్ 'నారాయణన్ వాఘుల్' కన్నుమూత
వేగంగా దర్యాప్తు జరిపి, నిందితులను అరెస్టు చేస్తాం: ఐజీ వినీత్ బ్రిజ్లాల్
‘‘స్వాతి మలివాల్కు సీఎం అపాయింట్మెంట్ లేదు’’
పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా జితేష్ శర్మ..
Summer special థండయ్ కుల్ఫీ రెసిపీ
రోహిత్తో నీతా అంబానీ సీరియస్ డిస్కషన్.. వీడియో వైరల్
Music Shop Murthy: ఆకట్టుకుంటున్న రాహుల్ సిప్లిగంజ్ ‘అంగ్రేజీ బీట్’ సాంగ్
Serial Actor Chandu: నేను పిచ్చివాడినైపోతా.. నటుడు చందు చివరి మాటలు వైరల్
200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
తప్పక చదవండి
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా జితేష్ శర్మ..
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాల సంస్థలకు మరో ఎదురు దెబ్బ
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- స్టార్ హీరో సినిమాలో సునీల్కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
- ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
- కేజ్రీవాల్ అనుచరుడు బిభవ్ అరెస్ట్
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
- బంగారాన్ని మించి.. వెండి హడల్..
Advertisement