చెన్నై, సాక్షిప్రతినిధి: బెంగళూరులో ఆదివారం రాత్రి జరిగిన పేలుడు చెన్నైకి చెందిన కుటుం బంలో విషాదాన్ని నింపింది. పుట్టినరోజు వేడుకలకు వెళ్లొస్తానని భర్తకు చెప్పి బెంగళూరుకు వెళ్లిన భవాని (37) పుణ్యలోకాలకు వెళ్లిపోయింది. చక్కనైన వ్యాపారం, ఇద్దరు పిల్లలతో కళకళలాడే ఆ కాపురంలో కన్నీళ్లు నింపింది. చెన్నై మౌంట్రోడ్డు ఎల్ఐసీ వెనుకవైపున ఉన్న ఆటో బజారులో భవాని భర్త బాలన్ టైర్ల కంపెనీని నడుపుతున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు లక్ష్మీదేవీ, భరత్ ఉన్నారు. బెంగళూరులోని బంధువుల ఇంటిలో జరిగే పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు భవాని, ఇద్దరు పిల్లలు, వీరి బంధువులు మొత్తం 8 మంది వెళ్లారు. బెంగళూరులో ఎంబీఏ చదివే కార్తీక్ (27) ఇటీవలే చెన్నైకి వచ్చి తిరుగు ప్రయాణంలో భవానీ కుటుంబ సభ్యులను వెంటపెట్టుకుని బెంగళూరు వెళ్లాడు.
పుట్టినరోజు వేడుకల్లో సంతోషంగా పాల్గొన్న భవాని ఆదివారం రాత్రి చెన్నై బయలుదేరేందుకు రైల్ టికెట్ రిజర్వు చేసుకుంది. అయితే టికెట్ రిజర్వేషన్ ఖరారు కాకపోవడంతో ప్రయాణాన్ని వాయిదా వేసుకుంది. ప్రయాణం ఎలాగూ రద్దయింది కదా అని తన ఇద్దరు పిల్లలు వెంటరాగా కార్తీక్ను తోడుతీసుకుని ఆదివారం షాపింగ్కు బయలుదేరింది. వస్తువులను కొనుగోలు చేస్తూ ఫ్లాట్ఫామ్ మీద నడుస్తుండగా బాంబు పేలుడు సంభవించింది. భవాని, కార్తిక్తో పాటూ మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. భవాని తలకు బలంగా గాయమడంతో తీవ్ర రక్తస్రావమైంది. పేలుడు దాటికి పరుగులు తీసిన జనం నెమ్మదిగా ప్రమాదస్థలికి చేరుకున్నారు. ముఖమంతా రక్తం ముద్దగా మారిన స్థితిలో రోడ్డుపై పడివున్న భవానిని చూసి గుమిగూడిన ప్రజలంతా మానవబాంబుగా భావించారు.
ఎవరూ ఆమె దగ్గరికి చేరేందుకు, సాహసించలేదు. తీవ్రగాయాలకు గురై సమీపంలోనే పడి వున్న కార్తీక్ స్థానికులను పిలిచి విషయం చెప్పడంతో, ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే దురదృష్టవశాత్తు ఆస్పత్రిలో చేర్చిన కొద్దిసేపటిలోనే ఆమె కన్నుమూశారు. షాపింగ్ సమయంలో భవాని, కార్తిక్తో కలిసి నడిచిన ఇద్దరు పిల్లలూ పేలుడుకు కొద్దిసేపటికి ముందు అక్కడి స్టేడియంలో ఆడుకుంటామని చెప్పి వెళ్లడంతో అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి బైటపడ్డారు. భవాని మృతి చెందిన సమాచారంతో భర్త బాలన్, మరికొందరు కుటుంబ సభ్యులు రాత్రికిరాత్రే బెంగళూరుకు చేరుకున్నారు. పోస్టుమార్టం ముగిసిన తరువాత భవాని మృతదేహాన్ని చెన్నైకి తీసుకువస్తారని తెలుస్తోంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మృతురాలు భవాని కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.
పుట్టిన రోజుకని వెళ్లి. .. బాంబుకు బలైంది
Published Tue, Dec 30 2014 9:05 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement