దత్తిరాజేరు : మనస్తాపంతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని టి. బూర్జివలసలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పెదమానాపురం ఎస్సై నాయుడు అందించిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన వై. రామునాయుడి (32) భార్య చిన్నమ్మడు కొద్ది రోజుల కిందట కన్నవారింటికి పాతినవలస వెళ్లింది. నెలలు గడుస్తున్నా చిన్నమ్మడు ఇంటికి రాకపోవడంతో రామునాయుడు మనస్తాపం చెంద తన ఇంటి సమీపంలోని పశువుల శాలలో ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి ఒక కుమార్తె ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
Published Sun, Mar 25 2018 5:07 PM
Related news
-
ఇద్దరు కుమార్తెలతో తల్లి బలవన్మరణం
సాక్షి, చెన్నై: భర్తతో అభిప్రాయ భేదాలు విడాకుల వరకు వెళ్లడంతో తీవ్ర మనో వేదనకు గురైన ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలతో పాటు తానూ బలవన్మరణానికి పాల్పడింది. దిండుగల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు.. దిండుగల్ జిల్లా తాడి కొంబు పరిధిలోని కామాక్షిపురం శక్తినగర్కు చెందిన శ్రీనివాసన్(42), మేనక (35) దంపతులకు హిందు మహావిని(16), తన్యశ్రీ(11) కుమార్తెలు ఉన్నారు. ఈ ఇద్దరు పిల్లలు స్థానికంగా సీబీఎస్ఈ పాఠశాలలో పది, ఆరు తరగతులు చదువుతున్నారు. మహావిని ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తోంది. ఈ పరిస్థితిలో కొద్ది రోజులుగా ఈ దంపతుల మధ్య జరిగిన గొ డవ విడాకుల కోసం కోర్టు వరకు వెళ్లింది.నందవనం రోడ్డులో తాను నడుపుతున్న టూ వీలర్ సర్వీస్ సెంటర్ లో వాటర్ మోటార్ పనిచేయక పోవడంతో సోమవారం ఇంట్లో ఉన్న మోటారును తీసుకెళ్లేందు కు శ్రీనివాసన్ ప్రయత్నించాడు. దీనిని మేనకతో పాటు పిల్లలు అడ్డుకున్నారు. తమ గొడవలు విడా కుల కోసం కోర్టు వరకు వెళ్లిన నేపథ్యంలో శ్రీనివా సన్ చర్యలపై మేనక మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సాయంత్రం అతడిని పోలీసులు పిలిపించి చీవాట్లు పెట్టారు. రాత్రి పోలీసు స్టేషన్ నుంచి వచ్చిన శ్రీనివాసన్ ఇంట్లో ఉన్న తన బట్టలను తీసుకెళ్లేందుకు వెళ్లాడు.ఇంటి తలుపులు తెరవక పోవడంతో ఇరుగు పొరుగు వారి సాయంతో కిటికి తలుపులు పగుల కొట్టి చూశారు. లోపల గది లో తన ఇద్దరు కుమార్తెలతో పాటుగా మేనక ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టా నికి తరలించారు. శ్రీనివాసన్ను విచారించగా తాను పొద్దుపోయే వరకు పోలీసు స్టేషన్లోనే ఉన్న ట్లు చెప్పాడు. మనస్తాపంతో ఉన్న మేనక పిల్లలతో పాటు బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని పో లీసులు నిర్ధారించారు. -
Hassan sex scandal: రాజుకుంటున్న పెన్డ్రైవ్
శివాజీనగర/ బనశంకరి: హాసన్లో మహిళలపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసు రోజురోజుకూ బిగుసుకుంటోంది. సిట్ విచారణ ప్రారంభం కాగా, ఇంతలో జాతీయ మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. ఈ కేసులో తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక అందించాలని కమిషన్ అధ్యక్షురాలు రేఖా శర్మ.. రాష్ట్ర డీజీపీ అలోక్మోహన్ను మంగళవారం లేఖ రాశారు. ఈ ఘటనను ఆమె తీవ్రంగా ఖండించారు. ఇలాంటి సంఘటనలు మహిళల సురక్షతకు ప్రమాదకరం, హింసా సంస్కృతిని పెంచుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేసు వెలుగులోకి రాగానే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి దేశం వదిలి వెళ్లారని సమాచారం ఉంది.పారిపోయిన వ్యక్తిని త్వరగా అరెస్ట్ చేయడానికి అన్ని చర్యలూ తీసుకోవాలన్నారు. ఈ కేసును సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు చేసి బాధ్యులకు శిక్ష విధించాలని లేఖలో కోరారు. అనేక మంది మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన నగ్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం మహిళా సమాజం గౌరవానికి భంగం కలిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వీడియోలు వైరల్ కాకుండా అడ్డుకోవాలని, వ్యాప్తి చేసేవారిపై క్రిమినల్ కేసు పెట్టి విచారణ చేపట్టాలని కోరారు. బెంగళూరు, హుబ్లీలో నిరసనలు హాసన్ లైంగిక దాడి ఘటనలను ఖండిస్తూ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నగరంలోని మల్లేశ్వరంలో బీజేపీ ఆఫీసును ముట్టడించేందుకు ప్రయతి్నంచారు. లైంగిక ఘటనల నిందితుడైన ప్రజ్వల్ విదేశాలకు పరారు కావడానికి బీజేపీ సహకరించిందని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా పోలీసుల–కార్యకర్తల మధ్య వాగి్వవాదం నెలకొంది. బెంగళూరు మహారాణి క్లస్టర్ కాలేజీలో ఎన్ఎస్యూఐ నేతృత్వంలో విద్యారి్థనులు ధర్నా చేశారు. మహిళలతో చెలగాటమాడుతున్నారు, చరిత్రలో ఇలాంటి పనులు ఎవరూ చేయలేదు. 65 సంవత్సరాల మహిళపై వికృత చేష్టలకు పాల్పడ్డారు. మహిళలకు భద్రత కల్పించాలి. సమాజంలో ఎవరు చేసినా తప్పు తప్పే. ఆయనను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జేడీఎస్ భేటీ ముట్టడికి యత్నం ఇక హుబ్లీలో కుమారస్వామి ఆధ్వర్యంలో జేడీఎస్ కోర్ కమిటీ సమావేశం జరిగిన హోటల్ వద్దకు కాంగ్రెస్ నాయకులు ర్యాలీగా వచ్చారు. సమావేశం జరిగే హాల్లోకి చొరబడేందుకు యతి్నంచగా జేడీఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది.500 మందిపై లైంగిక దాడులు: ఎంపీ ప్రజ్వల్ లైంగిక దాడులకు ప్రధాని మోదీ, మాజీ ప్రధాని దేవేగౌడ కుటుంబమే కారణమని ఎంపీ డీ.కే.సురేశ్ ఆరోపించారు. బెంగళూరులో తన ఇంట్లో విలేకరులతో మాట్లాడుతూ హాసన్ బీజేపీ నాయకుడు దేవరాజేగౌడ ఈ విషయమై ముందే పార్టీ సీనియర్లకు లేఖ ద్వారా తెలిపినా దాచిపెట్టి, ప్రజ్వల్ను అభ్యరి్థగా నిలబెట్టారన్నారు. సుమారు 500 మందికి పైగా మహిళలు లైంగిక దాడులకు గురయ్యారని చెప్పారు. ప్రజ్వల్తో సంబంధం లేదని హెచ్డీ కుమారస్వామి చెప్పడం సమంజసం కాదన్నారు. -
Doctor Family Suicide: నేను లేక.. మీరుండలేరు..!
పటమట(విజయవాడతూర్పు): తల్లి, భార్య, ఇద్దరు పిల్లలను హతమార్చి ఆత్మహత్య చేసుకున్న ఆర్థోపెడిక్ సర్జన్ ధారావత్ శ్రీనివాస్(40) ఘటన విజయవాడ నగరంలో మంగళవారం సంచలనం రేకెత్తించింది. చిరకాల స్వప్నమైన ఆస్పత్రిని ప్రారంభించిన అనతికాలంలోనే దాన్ని వదులుకోవాల్సి రావడంతో మనస్తాపానికి గురైన అతను తాను అల్లారుముద్దుగా సాకుతున్న ఇద్దరు పిల్లలు, తనతో జీవితాన్ని పంచుకున్న భార్యను, తనను పెంచి పెద్ద చేసిన తల్లిని హతమార్చి, తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణం విజయవాడ గురునానక్ నగర్లో జరిగింది. శ్రీనివాస్ అన్న దుర్గాప్రసాద్ పటమట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన విజయవా డ పోలీస్ కమిషనర్ రామకృష్ణ, డీసీపీ అదిరాజ్సింగ్ కేసు దర్యాప్తు చేపట్టారు.పోలీసుల కథనం మేరకు.. విజయవాడ గురునానక్ నగర్లోని మారుతీ కో– ఆపరేటివ్ కాలనీలో ప్లాట్ నంబరు 53లోని భవనంలో నివసించే ధారావత్ శ్రీనివాస్ గుంటూరులో వైద్య విద్య అభ్యసించారు. అనంతరం విజయవాడలో కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రాక్టీస్ చేశారు. సొంత ఆస్పత్రి ప్రారంభించాలని కలలు కన్నారు. ఈ క్రమంలో తన సేవింగ్స్తోపాటు ఓ ప్రైవేటు బ్యాంక్ నుంచి లోను తీసుకుని ఇటీవల సూర్యారావుపేటలో శ్రీజ ఆర్థోపెడిక్ క్లినిక్ ప్రారంభించారు. పూర్తిస్థాయిలో యంత్రపరికరాలు ఏర్పాటు చేసేందుకు డాక్టర్ ధారవత్ శ్రీనివాస్ స్నేహితులైన నగరంలోని ఆస్పత్రుల్లో పనిచేసే ముగ్గురు వైద్యులు అప్పులు ఇచ్చారు. దీంతో అప్పులు రూ.3 కోట్లకు చేరాయి. బ్యాంకు రుణం, స్నేహితుల వద్ద చేసిన అప్పులతో ఆస్పత్రి నడుపు తున్నా అనుకున్నంత స్థాయిలో ఆదాయం రావడంలేదు. అదే సమయంలో తామిచ్చిన అప్పులు తీర్చాలని స్నేహితులు ఒత్తిడి చేశారు. అప్పు కింద ఆస్పత్రి లో 90 శాతం వాటాను వారు సొంతం చేసుకున్నారు.వారం క్రితమే దారుణానికి వ్యూహం తన ఆర్థిక పరిస్థితులు రోజురోజుకు మరింతగా దిగజారడంతో తానే ప్రాణంగా జీవిస్తున్న తల్లి, భార్య, పిల్లలు అనాథలవుతారని డాక్టర్ శ్రీనివాస్ భావించారు. వారి ప్రాణాలు తీసి, ఆత్మహత్య చేసుకోవా లని భావించారు. ఏప్రిల్ 25వ తేదీన గురునానక్ నగర్లోని సూపర్ మార్కెట్కు వెళ్లి రెండు చాకులు కొన్నారు. మంగళవారం తెల్లవారుజామున నిద్రపోతున్న తల్లి రమణమ్మ (65), భార్య ఉషా (38), కూతురు శైలజ (11), శ్రీహాన్ (6) మెడపై కత్తితో గాట్లు పెట్టి హత్య చేశారు. ఉదయం 6.30 గంటల సమయంలో ఇంటిలో ఉన్న కొంత నగదు, నగలు, ఆస్తి తాలూక డాక్యుమెంట్లను ఓ బ్యాగులో సర్ది దానిని కారులో పెట్టారు. అనంతరం ఎదురింటి గేటుకు ఉన్న డబ్బాలో తన అన్న దుర్గాప్రసాద్కు రాసిన లెటరు, తన కారు తాళం చెవిని అందులో వేశారు. తిరిగి తన ఇంటికి వచ్చి వరండాలో ఉరివేసుకున్నారు.తన వాట్సాప్కు వాయిస్ మెసేజ్ ఆత్మహత్య చేసుకునే ముందు డాక్టర్ శ్రీనివాస్ తన వాట్సాప్ నంబరుకు వాయిస్ మెసేజ్ పెట్టుకున్నారు. తన పరిస్థితికి తానే కారణమని, తనకు ఆరోగ్యం సహకరించడం లేదని, ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి బయటపడలేక ఆత్మహత్య చేసు కుంటున్నానని పేర్కొన్నారు. తాను లేకపోతే తన కుటుంబ సభ్యులు అనాథలు అవుతారన్న భయంతో వారిని కూడా హతమార్చుతున్నానని ఆ మెసేజ్లో వివరించారు. క్లూస్ టీంతో ఆధారాల సేకరణ డాక్టర్ శ్రీనివాస్ కుటుంబ సభ్యుల మరణాలపై విచారణ చేపట్టిన పోలీస్ కమిషనర్ పి.హెచ్.డి.రామకృష్ణ డాగ్స్కా్వడ్, క్లూస్ టీంను రప్పించారు. శ్రీనివాస్ హత్యకు వినియోగించిన చాకులు, దాని బిల్లు, సూపర్ మార్కెట్ సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు డాక్టర్ శ్రీనివాసే కుటుంబ సభ్యులను హత్యచేశాడని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.మోసాన్ని జీరి్ణంచుకోలేక..! ఆర్థోపెడిక్ సర్జన్గా విజయవంతంగా కొనసాగు తున్న శ్రీనివాస్కు సొంతగా ఆస్పత్రి ఏర్పాటు చేయాలన్నది కల. ఆ మేరకు సూర్యారావుపేటలో శ్రీజ ఆర్థోపెడిక్ క్లినిక్ను ప్రారంభించారు. దాని నిర్వహణ కోసం స్నేహితులు అప్పులు ఇచ్చారు. ఆ అప్పులు తీర్చాలని ఒత్తిడిచేసి చివరకు ఆస్పత్రిలో 90 శాతం వాటా రాయించుకున్నారు. అనంతరం ఆస్పత్రిలోనే పనిచేయాలని శ్రీనివాస్ను ఒత్తిడిచేశారు. దీంతో మనస్తాపం చెంది శ్రీనివాస్ తల్లి, భార్య, పిల్లలను హత మార్చి ఆత్మహత్య చేసుకున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. శ్రీనివాస్ తండ్రి జమలయ్య నాయక్ విజయవాడ తూర్పు ఏసీపీగా పనిచేశారు. అతని అన్న నల్గొండ జిల్లా జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీనివాస్ అత్తింటి వారు కూడా ఆర్థికంగా స్థితి మంతులే. శ్రీనివాస్ కుటుంబ సభ్యుల మరణానికి తీర్చలేనంత అప్పులు కారణం కాదని, తన స్నేహితులే మానసిక క్షోభకు గురిచేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. -
వంట సరిగా చేయలేదని.. భార్యను చంపిన భర్త
నిజాంపేట్: వంట రుచిగా చేయలేదని ఓ వ్యక్తి భార్యతో గొడవపడి ఆమెను హతమార్చిన సంఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది.. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నవీన్ దుర్వే, రవీనా దుర్వే(28) నగరానికి వలస వచ్చి బాచుపల్లిలోని వెనుక ఉన్న ప్రగతి కన్స్ట్రక్షన్స్లో కార్మికులుగా పనిచేస్తూ గుడిసెల్లో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం. సోమవారం రాత్రి వంట విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. వంట సరిగా చేయడం లేదని ఆగ్రహానికి లోనైన నవీన్ ఇటుకతో భార్య రవీనా తలపై మోదడంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు నవీన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మసాజ్ పేరుతో అసహజ ప్రవర్తన
సనత్నగర్: థెరపిస్టుల ముసుగులో ఇద్దరు మహిళలు ఓ వ్యక్తిపై ‘అసహజ’ దాడికి యత్నంచడంతో పాటు అతడిని నగ్నంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెది రింపులకు దిగారు. దీంతో బాధితుడు భయ పడి రూ.20 వేలు ఇచ్చాడు. కానీ.. మరో రూ.30 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇన్స్పెక్టర్ పురేందర్రెడ్డి తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి.. సనత్నగర్కు చెందిన ఓ వ్యక్తికి తనకు తానుగా థెరపిస్టుగా చెప్పుకున్న ఓ మహిళ పరిచయమైంది. ఆమె ద్వారా భరత్నగర్కు చెందిన మరో మహిళ ఫోన్ నంబర్ను తీసుకుని మాట్లాడాడు. తాము థెరపిస్టులమని, మసాజ్ చేస్తామంటూ సదరు వ్యక్తితో నమ్మబలికారు. దీంతో అతడు ఆ ఇద్దరు మహిళలు చెప్పిన్నట్లుగా భరత్నగర్లోని వారి ఇంటికి వెళాఉ్లడు. అయితే.. పరిస్థితులపై అనుమానం వచ్చిన బాధితుడు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని భావించాడు. అతడు బయటికి వచ్చేందుకు ప్రయత్నిస్తుండగానే ఇద్దరు మహిళలు బలవంతంగా నిర్బంధించారు. అతడి ఒంటిపై దుస్తులు తీసి లైంగిక దాడికి యత్నంచారు. ఈ క్రమంలోనే నగ్న వీడియోలు తీశారు. అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరించారు. అలా చేయకుండా ఉండాలంటే తమకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఆందోళనకు గురైన ఆ వ్యక్తి రూ.20 వేలు ఆన్లైన్ ద్వారా వారికి ఇచ్చాడు. వారి బారి నుంచి బయటపడ్డానని భావిస్తున్న క్రమంలోనే మళ్లీ ఓ మహిళ ఫోన్ చేసి రూ.30 లక్షలు ఇవ్వాలని, లేకపోతే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు కుటుంబ సభ్యులకు పంపిస్తామని బెదిరించింది. దీంతో బాధితుడు సనత్నగర్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
Related News by category
-
‘రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులు దుర్వినియోగం’
బరంపురం: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని బీజేపీ బరంపురం లోక్సభ అభ్యర్థి డా.ప్రదీప్ పాణిగ్రాహి ఆరోపించారు. స్థానిక పాత బస్టాండ్లోని నందన్ ఇంటర్నేషనల్ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఒడిస్సా రాష్ట్ర అభివృద్ధికి విడుదల చేస్తున్న నిధులను అధికార పార్టీ బీజేడీ దారి మళ్లిస్తూ అవినీతికి పాల్పడుతోందని దుయ్యబట్టారు. రాష్ట్ర అభివృద్ధిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించి వివిధ రకాల పథకాల కింద కోట్లాది రూపాయులు విడుదల చేసినట్లు గుర్తు చేశారు. అధికార బీజేడీ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రజలు ఇప్పటికే గ్రహించారని చెప్పారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వారికి బుద్ధి చెబుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సుభాష్ పాఢి, ఎమ్మెల్యే అభ్యర్థి కె.అనిల్ కుమార్, సునీల్ సాహు తదితరులు పాల్గొన్నారు. -
నందన్కానన్ జూలో తెల్లపులి మృతి
భువనేశ్వర్: నగర శివారులోని బారంగ్ నందన్కానన్ జూలాజికల్ పార్క్లో 14 ఏళ్ల తెల్లపులి ‘స్నేహ’ శుక్రవారం జూలో చికిత్స పొందుతూ మరణించింది. గురువారం అస్వస్థతకు గురవ్వడంతో సత్వర చికిత్స ప్రారంభించారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న తరుణంలో తీవ్రమైన వడగాలుల కారణంగా ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. స్నేహ 2010 మార్చి 1న జన్మించింది. 14 ఏళ్ల జీవిత కాలంలో 3 ఈతల్లో 9 పిల్లల తల్లిగా జూలో పులుల సంతతి వృద్ధికి తోడ్పడింది. వీటిలో 3 తెలుపు, 4 సాధారణ, 2 మెలనిస్టిక్ వన్నెల పులులు ఉండడం విశేషం. 2022 అక్టోబర్లో 11 ఏళ్ల తెల్లపులి బిజయ మృతి చెందింది. ఊపిరితిత్తుల క్యాన్సర్కు గురై ఇది మరణించింది. అంతకుముందు 2019 అక్టోబర్లో కాలేయ సంబంధిత అనారోగ్యంతో సుభ్రాంశు అనే ఐదేళ్ల తెల్ల మగ పులి కూడా మరణించింది. నందన్కానన్ అధికారిక వనరుల సమాచారం ప్రకారం ప్రస్తుతం జూలో 27 పులులు ఉన్నాయి. వీటిలో సాధారణ పులులతో 7 తెలుపు మరియు 3 మెలనిస్టిక్ పులులు ఉన్నాయి.మావో డంప్ స్వాధీనం మల్కన్గిరి: జిల్లాలోని కలిమెల సమితి బోడిగేట్ట అడవిలో కూంబింగ్ నిర్వహించిన కోబ్రా, బీఎస్ఎఫ్ జవాన్లు మావోలు అమర్చిన భారీ డంప్ను వెలికితీశారు. వివరాల్లోకి వెళ్తే.. బేజాంగ్వాడ అడవిలో మావోల డంప్లు ఉన్నట్లు ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా జిల్లా ఎస్పీ నితీష్ వాద్వానికి సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో కోబ్రా, బీఎస్ఎఫ్ జవాన్లు ముమ్మరంగా గురువారం సాయంత్రం నుంచి కూంబింగ్ నిర్వహించారు. దీనిలో భాగంగా ఎలక్కనూర్ గ్రామం వద్ద డంప్ను స్వాధీనం చేసుకున్నారు. డంప్లో ఒక ఐఈడీ టిఫిన్ బాక్స్ బాంబ్, ఆరు గన్లు, 36 హైడ్ గ్రానేట్స్, రెండు సోలార్ ఎల్క్ట్రికల్ ప్యానెల్స్, ఒక గ్యాస్ సిలిండర్, 20 మీటర్ల కరెంట్ వైరు ఉన్నట్లు వెల్లడించారు. డంప్ స్వాధీనం చేసుకున్న జవాన్లను అధికారులు అభినందించారు. నలుగురు దోపిడీ దొంగలు అరెస్టు బరంపురం: నగర శివారులోని శ్రీక్షేత్ర విహార్ పక్కన పడియాలో దోపిడీకి సిద్ధమవుతున్న ముఠాని పోలీసులు అరెస్టు చేశారు. ఐఐసీ అధికారి గోపినాథ్ ప్రధాన్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం అర్థరాత్రి పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో నిమ్మఖండి పోలీసుస్టేషన్ పరిధిలో అర్థరాత్రి దోపిడీకి సిద్ధమవుతున్న ముఠా పోలీసుల కంటపడింది. దీంతో పోలీసులు వీరిని వెంబడించి చాకచక్యంగా పట్టుకొని అరెస్టు చేశారు. అరైస్టెనవారిలో గంజాం జిల్లాలోని గంగపూర్ గ్రామానికి చెందిన తపన్ సాహు, పద్మపూర్ గ్రామానికి చెందిన నిమోయ్ చరణ్ నాయక్, తెంతులిఖండి గ్రామానికి చెందిన దేబనంద గౌడ, అస్కాకి చెందిన కె.సుర్యారావులు ఉన్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి 2 బైక్లు, తుపాకీ, 5 గుండ్లు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశారు.బీజేడీలోకి చేరికలు పర్లాకిమిడి: గుమ్మా సమితి సభ్యులు బర్నింగ్ గొమాంగో, గుసాని సమితిలో ఎం.ఎస్.పూర్ పోలాకి విష్ణుప్రసాద్లు శుక్రవారం బీజేడీలో చేరారు. స్థానిక బీజేడీ పార్టీ కార్యాలయంలో మిశ్రణ్ పర్వ్ శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కెంగం సూర్యారావు కాంగ్రెస్ నుంచి బీజేడీలో చేరిన బర్నింగ్ గొమాంగో, విష్ణుప్రసాద్లను పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. బీజేడీ పార్టీని వీడి ఇతర పార్టీలోకి వెళ్లినవారు పార్టీ ఽద్రోహులని బీజేడీ ఛత్ర విభాగం అధ్యక్షుడు సుర్జిత్ త్రిపాఠి అన్నారు. -
శనివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2024
● ఓటెత్తాలిఓటుహక్కు వినియోగంపై జిల్లా యంత్రాంగం విరివిగా చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈసారి జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో 85 శాతంకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించే విధంగా ప్రణాళికలు రూపొందించింది. ఈ క్రమంలో జిల్లాలోని గుడారిలో శుక్రవారం ఓటుహక్కు వినియోగంపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. గుడారి పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీల్లో చైతన్యం కల్పించేవిధంగా సిబ్బంది బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. – రాయగడన్యూస్రీల్ -
ఓటే.. నీ ఆయుధం..!
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుహక్కు వినియోగం ప్రక్రియ అత్యంత బృహత్తరమైనది. ఈ ప్రక్రియని విజయవంతం చేయడంలో యువతని భాగస్వాములుగా మేల్కొలిపేందుకు ఎన్నికల సంఘం అంకితభావంతో కృషి చేస్తోంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) మార్గదర్శకంలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లాస్థాయిలో పలు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాలాసోర్ జిల్లాలోని వివిధ కళాశాలల్లో విద్యార్థులు ఈ కార్యకలాపాల్లో చురుకుగా పాలుపంచుకున్నారు. ప్రధానంగా తొలిసారి ఓటుహక్కు పొందిన సరికొత్త విద్యార్థి ఓటర్లు ఈ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఓటుహక్కు ప్రాధాన్యత ఇతివృత్తంగా బాలాసోర్ ప్రాంతంలో పలు పాఠశాలలు, కళాశాలల్లో ఇటువంటి చైతన్య కార్యక్రమాలు చేపట్టారు. మొదటిసారి ఓటు వేయనున్న యువతలో ఓటుహక్కు సద్వినియోగంపై అవగాహనను పెంపొందించే లక్ష్యంతో పలు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మన ప్రజాస్వామ్యం భవిష్యత్తును రూపొందించడంలో మన యువతను శక్తివంతం చేయడం చాలా కీలకం అని ఎన్నికల సంఘం తెలిపింది. డీఈవో బాలాసోర్ ఆధ్వర్యంలో తొలిసారిగా ఓటు వేయనున్న విద్యార్థులను అవగాహన కల్పించే దృక్పథంతో రంగోలీ పోటీలు నిర్వహించారు. వీరు రూపుదిద్దిన ప్రతి రంగవల్లి భారత ప్రజాస్వామ్య ప్రాముఖ్యతను ప్రతిబింబించిందని నిర్వాహక వర్గం అభినందించింది. – భువనేశ్వర్ -
మహిళాభివృద్ధే బీజేడీ లక్ష్యం
రాయగడ: రాష్ట్రంలో మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సాహించి, అభివృద్ధిలో వారిని అగ్రస్థానంలో నిలపడమే బీజేడీ లక్ష్యమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, రాయగడ జిల్లా ఎన్నికల పరిశీలకుడు అతున్ సవ్యసాచి నాయక్ అన్నారు. స్థానిక తేజస్వీ హోటల్ మైదానంలో కొత్తగా నిర్మించిన బీజేడీ కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. ముందుగా స్థానిక కొత్త బస్టాండ్ వద్ద దివంగత ముఖ్యమంత్రి బిజు పట్నాయక్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన భారీ బైకు ర్యాలీలో పాల్గొన్నారు. బీజేడీ జిల్లా అధ్యక్షుడు నెక్కంటి భాస్కరరావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాయగడ శాసనసభ నుంచి పోటీ చేస్తున్న అనసూయా మాఝి, కొరాపుట్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కౌలస్య హికకలు ర్యాలీలో పాల్గొన్నారు. కొత్త బస్టాండ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ మెయిన్ మార్కెట్ మీదుగా ఫ్లైవర్ బ్రిడ్జి నుంచి తేజస్వీ ైమెదానం వరకు కొనసాగింది. వేల సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ● మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం అనంతరం జరిగిన కార్యకర్తల సమావేశంలో అతున్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిచ్చినట్లు తెలియజేశారు. మహిళల ఆర్థిక, సామాజిక రంగాల అభివృద్ధికి స్వయం సహాయక బృందాలు, మిషన్ శక్తి వంటి పథకాలను బీజేడీ ఏర్పాటు చేసిందని వెల్లడించారు. గడిచిన రెండు దశాబ్ధాలుగా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న బీజేడీ ప్రభుత్వానికి మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. రాయగడ శాసనసభ, కొరాపుట్ లోక్సభ వంటి స్థానాల్లో మహిళలకు టిక్కెట్టు ఇచ్చి ఎన్నికల బరిలో నిలబెట్టిన నవీన్ ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత ఎంతో అర్థం చేసుకోవచ్చని వివరించారు. ● ఆశీర్వదించండి ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ప్రప్రథమంగా రాయగడ శాసనసభ నుంచి, అదేవిధంగా కొరాపుట్ లోక్సభ నుంచి మహిళలు పోటీ చేస్తున్నారు. దీంతో ప్రజల ఆశీర్వాదంతో తాము ముందుకు వెళ్లి అభివృద్ధికి కృషి చేస్తామని అనసూయా మాఝి, కౌసల్య హికకలు వేదికపై నుంచి అభ్యర్థిచారు. కార్యకర్తల సహకారం ఉంటే తమ విజయం సునాయాసమవుతుందన్నారు. అందుకు అందరూ సహకరించాలని కోరారు. ● బీజేడీలో చేరికలు ఈ సందర్భంగా కాంగ్రెస్ యువ నాయకుడు, ప్రముఖ న్యాయవాది బాబు రాజ్గురు, అతని మద్దతుదారులు బీజేడీ తీర్ధం పుచ్చుకున్నారు. మంత్రి నాయక్ వారికి కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జితు పూజారి, దయానిధి కొంధొపాణి, నందు మండంగి, విశ్వనాథ్ పిడిక, కృష్ణ సరక, శాంత గౌరి పూజారి వంటి కాంగ్రెస్ యువ నాయకులు బీజేడీలో చేరినవారిలో ఉన్నారు. మంత్రి సవ్యసాచి నాయక్ రాయగడలో భారీ బైక్ ర్యాలీ
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
Lok sabha elections 2024: బారామతి నుంచి మెయిన్పురి దాకా...హోరాహోరీ
బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దే..: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
Photos
View allVideo
View allతప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement