నేటి నుంచి వైఎస్ఆర్ జిల్లాలో జగన్ పర్యటన | Sakshi
Sakshi News home page

నేటి నుంచి వైఎస్ఆర్ జిల్లాలో జగన్ పర్యటన

Published Wed, Oct 5 2016 7:42 AM

నేటి నుంచి వైఎస్ఆర్ జిల్లాలో జగన్ పర్యటన - Sakshi

పులివెందుల(వైఎస్‌ఆర్‌ జిల్లా): వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేటి నుంచి రెండు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నట్లు కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన తెలిపిన మేరకు పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం ఉదయం 9గంటలకు జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల మండలం వెంకటాపురం గ్రామానికి చేరుకొని సోమవారం అనారోగ్యంతో మృతిచెందిన పార్టీ నాయకులు తిమ్మానాయుడు కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం 9.30 నుంచి మధ్యాహ్నం వరకు క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. మధ్యాహ్నం 3.30కు ముద్దనూరు చేరుకుని వైఎస్‌ఆర్‌సీపీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. 6.30కు ప్రొద్దుటూరులోని అమ్మవారిశాలకు చేరుకుని దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనం చేసుకుంటారు.

గురువారం ఉదయం 8.30కు పులివెందుల అమ్మవారిశాలకు చేరుకుని దసరా ఉత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం 10.30గంటలకు కడపకు చేరుకుని పార్టీ నాయకులు మాసీమ బాబు అన్న యల్లారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందడంతో వారి కుటుంబసభ్యులను పరామర్శించనున్నట్లు ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement