వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్‌కు తప్పిన ప్రమాదం | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్‌కు తప్పిన ప్రమాదం

Published Sun, Nov 6 2016 11:58 PM

వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్‌కు తప్పిన ప్రమాదం - Sakshi

కృష్ణా జిల్లా : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. జి కొండూరు మండలం కట్టుబడిపాలెం వద్ద ఆదివారం రాత్రి ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆయన్ను సమీప ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. చికిత్స అనంతరం జోగి రమేష్‌ను ఇంటికి తరలించారు. ప్రమాద ఘటనపై జిల్లా వైఎస్సార్‌సీపీ నేతలు ఆయనకు ఫోన్‌ చేసి పరామర్శించారు.

Advertisement
Advertisement