సెల్పీ కెమెరా ఫోన్స్ కాన్సెప్టు తో మార్కెట్ లోకి దూసుకొచ్చిన చైనా మొబైల్ దిగ్గజం 'ఒప్పో' తన సరికొత్త స్మార్ట్ఫోన్ను గురువారం లాంచ్ చేసింది. అమేజింగ్ ప్రైస్లో ఒప్పో ఎఫ్ 3 ను భారతమార్కెట్లో విడుదల చేసింది. డబుల్ సెల్పీ కెమరాలతో స్పెషల్ స్మార్ట్ఫోన్ను ఒప్పో గ్లోబల్ ప్రెసిడెంట్ స్కై లీ ముంబైలో ఆవిష్కరించారు. సెల్ఫీ క్లిక్కింగ్ ట్రెండ్ బాగా పెరిగిన నేపథ్యంలో... వినయోగదారుల అవసరాలకు తగిన విధంగా, వారి అభిరుచికి తగినట్లుగా ఒప్పో డివైస్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు లీ వెల్లడించారు.
ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒప్పో ఎఫ్ 3 ధరలను రూ.19,900గా కంపెనీ నిర్ణయించింది. అలాగే నేటినుంచి (మే4) నుంచి మే 12 వరకు ప్రి ఆర్డర్ చేసుకోవచ్చని తెలిపింది. అంతేకాదు ముగ్గురు లక్కీ విన్సర్స్ మరో బంపర్ ఆఫర్ కూడా ప్రకటించింది. లండన్ లోజరిగే ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ కు ఉచిత ట్రిప్ను అందించనుంది.
2.0 వెర్షన్ కు చెందిన ఒప్పో ఎఫ్ 3 ఇతర ఫీచర్స్ విషయానకి వస్తే 5 అంగుళా ఫుల్హెచ్ డీ డిస్ప్లే, 16 ఎంపి సెల్పీ కెమెరా, 13ఎంపీ రియర్ కెమెరా, 4జీబీ ర్యామ్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 3200ఎంఏ హెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉన్నాయి. ఫ్రంట్లో సెల్ఫీ కోసం ఒక కెమెరాను , గ్రూప్ సెల్ఫీకోసం మరో కెమెరాను అమర్చింది. అలాగే ట్రిపుల్ స్లాట్ ట్రే కార్డును( రెండు 4 జీ సిమ్స్, ఒక మొమరీ కార్డు) అందిస్తోంది.
సెల్పీ కెమెరా ఫోన్లు కావాలనుకునే వారికి ఒప్పో ఎఫ్ 3 మంచి ఆప్షన్ అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.