ఆర్టీసీ బస్సు బోల్తా: 10 మందికి గాయాలు | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు బోల్తా: 10 మందికి గాయాలు

Published Fri, Jun 5 2015 9:36 AM

ఆర్టీసీ బస్సు బోల్తా: 10 మందికి గాయాలు - Sakshi

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలం మొగులాన్పల్లి తాండ వద్ద శుక్రవారం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు బాన్సువాడ నుంచి ఎల్లారెడ్డికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై మరింత సమాచారం అందవలసి ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement