కలుషితాహారం తిని 10 మందికి అస్వస్థత | Sakshi
Sakshi News home page

కలుషితాహారం తిని 10 మందికి అస్వస్థత

Published Wed, Oct 21 2015 4:06 PM

10 people hospitalized for food poisoning

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో కలుషితాహారం తిని 10 మంది అస్వస్థతకు గురయ్యారు. విజయదశమి సందర్భంగా  గౌరారం పంచాయితిలోని గుట్టకింది తండాలో మంగళవారం రాత్రి తండావాసులు విందు ఏర్పాటుచేసుకున్నారు. విందులో మాంసాహారాన్ని కూడా తీసుకున్నారు.

ఆ తర్వాత నుంచి10 మందికి తీవ్రంగా వాంతులు, విరోచనాలు కావడంతో నీరసించిపోయారు. దీంతో వారిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఆహారం కలుషితం కావడం వల్లే అస్వస్థతకు గురైనట్లు వైద్యులు చెబుతున్నారు.
 

Advertisement
Advertisement