41వేలు దాటిన కరోనా కేసులు | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కొత్తగా 1676 కరోనా కేసులు

Published Thu, Jul 16 2020 10:31 PM

1676 New Coronavirus Cases Recorded In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 1,676 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 41,018కు చేరింది. ఇం దులో 13,328 యాక్టివ్‌ కేసులుండగా 27,295 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారు 67శాతం ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనాతో గురువారం 10 మంది మరణించగా, ఇప్పటివరకు నమోదైన మరణాలు 396కు పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 2,22,693 పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి మిలియన్‌ జనాభాకు 5,350 పరీక్షలు చేసినట్లు వైద్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో 16 ప్రభుత్వ, 23 ప్రైవేటు ల్యాబ్‌లలో పరీక్షలు చేస్తున్నట్లు మీడియా బులెటిన్‌లో వైద్యశాఖ పేర్కొంది.

తాజాగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 788, రంగారెడ్డిలో 224, మేడ్చల్‌లో 160, కరీంనగర్‌లో 92, నల్లగొండలో 64, సంగారెడ్డిలో 57, వనపర్తిలో 51, వరంగల్‌ అర్బన్‌లో 47, నాగర్‌కర్నూల్‌లో 30, మెదక్‌లో 26, నిజామాబాద్, సూర్యాపేట్‌లో 20, మహబూబాబాద్‌లో 19, ఖమ్మంలో 10, భూపాలపల్లి, వికారాబాద్‌లో 8, నారాయణపేట్, పెద్దపల్లిలో 7, మహబూబ్‌నగర్, కొత్తగూడెంలో 6, కామారెడ్డి, సిద్దిపేట్, గద్వాలలో 5, మంచిర్యాలలో 4, సిరిసిల్లలో 3, వరంగల్‌ రూరల్, జగిత్యాల, భువనగిరి, జనగామ జిల్లాల్లో ఒక్కోటి చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

 

Advertisement
Advertisement