విద్యుద్ఘాతంతో ఇద్దరి బీజేపీ కార్యకర్తలు మృతి | Sakshi
Sakshi News home page

విద్యుద్ఘాతంతో ఇద్దరి బీజేపీ కార్యకర్తలు మృతి

Published Mon, Jun 1 2015 10:52 AM

2 bjp followers died due to current shock

హైదరాబాద్: వనస్థలిపురంలోని ఎన్జీవోస్ కాలనీలో సోమవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. జెండా పైపును తొలగించడానికి ప్రయత్నించిన ఇద్దరు బీజేపీ కార్యకర్తలు విద్యుత్ షాక్‌తో మృతిచెందారు. కాలనీకి చెందిన సందీప్ రెడ్డి(25), కాశిరెడ్డి(25) బీజేపీలో కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జండా ఆవిష్కరణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. జండా దిమ్మెను శుభ్రం చేసి రంగులు వేయడానికి.. పైపు తీయడానికి ప్రయత్నించారు. ఇంతలో పైన ఉన్న విద్యుత్ తీగలకు పైపు తాకడంతో.. ఒక్కసారిగా ఇద్దరు కుప్పకూలారు. స్తానికులు గమనించి ఏం జరిగిందో తెలుసుకునేలోపే ఇద్దరు యువకులు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement