ట్రాక్టర్ బోల్తా: ఇద్దరు మృతి | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బోల్తా: ముగ్గురి మృతి

Published Mon, Mar 14 2016 2:12 PM

2 dies in road accidemt at khammam district

మధిర: ఖమ్మం జిల్లా మధిర మండలం జాలిముడి గ్రామం వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ముగ్గురి మృతి చెందగా ఏడుగురికి గాయాలయ్యాయి. మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన కొందరు ఏన్కూరులో జరిగే వివాహ నిశ్చితార్ధ కార్యక్రమానికి ట్రాక్టర్‌లో బయలు దేరారు. వారి వాహనం జాలిముడి గ్రామం వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురి అక్కడికక్కడే మృతి చెందగా ఏడుగురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


 

Advertisement

తప్పక చదవండి

Advertisement