కళాశాల బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు | Sakshi
Sakshi News home page

కళాశాల బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు

Published Tue, Mar 8 2016 10:15 AM

20 injured in college bus roll over

విజ్ఞాన, విహార యాత్ర ముగించుకొని తిరిగి వస్తున్న విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి బోల్తాకొట్టింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లా తల్లాడ జెన్నింగ్ మిల్ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. అనంతపురంలోని బాలాజీ ఫార్మసీ కళాశాలకు చెందిన 42 మంది విద్యార్థుల బృందం కళాశాల బస్సులో విజ్ఞాన , విహార యాత్రకు బయలుదేరారు. ఈ క్రమంలో సెమినార్లలో పాల్గొన్న అనంతరం భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని తిరగి ఇంటికి వెళ్తుండగా.. బస్సు తల్లాడ జెన్నింగ్ మిల్ వద్దకు చేరుకోగానే బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంటలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement
Advertisement