సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో 2010కి ముందు రిజిస్టరైన బీఎస్1, బీఎస్2 ఆటోలపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. 2010కి ముందున్న వాహనాలు ఎన్ని?.. వాటి వల్ల కలుగుతున్న కాలుష్యం ఎంత? 2010 తర్వాత ఎన్ని వాహనాలు రిజిస్టర్ అయ్యాయి? వాటి వల్ల ఎంత కాలుష్యం ఏర్పడుతోంది? వంటి వివరాలను తెలియజేయాలని ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ మంతోజ్ గంగారావుల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
జీహెచ్ఎంసీ పరిధిలో 2010లో రిజిస్టరైన బీఎస్1, బీఎస్2 ఆటోలపై నిషేధం విధించి, సీఎన్జీ, ఎల్పీజీ ఆటోలనే అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్కు చెందిన సంతకుమార్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ.. పాత ఆటోల వల్ల కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతోందన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. కాలుష్యానికి ఆటోలనే కారణంగా చూపడం సరికాదంది. ఆటోలు పేదవాళ్లు నడుపుకునేవని, కార్లు, బస్సుల వల్ల కాలుష్యం రావడం లేదా అని ప్రశ్నించింది.
ఆటోలను నిషేధిస్తే వాటిపై ఆధారపడి జీవించే వారి పరిస్థితి ఏమిటని నిలదీసింది. దీనికి కృష్ణయ్య స్పందిస్తూ.. దీపావళి సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రస్తావించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ఈ సారి బాణసంచా కాల్చడం తగ్గిందని, ప్రజల్లో అవగాహన రావడమే దీనికి కారణమని తెలిపింది. మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
2010కి ముందు ఆటోలను నిషేధించాలి
Published Wed, Oct 25 2017 3:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రత్నగిరిపై కుండపోత
షెల్టర్ శ్లాబు కూలి యువకుడి మృతి
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
పిడుగు పడి మేకల కాపరి మృతి
జగన్తోనే సంక్షేమం
కోనసీమలో పలుచోట్ల అకాల వర్షం
హమ్మయ్య చల్లబడింది
IPl 2024: శాంసన్ ఇన్నింగ్స్ వృథా.. రాజస్తాన్పై ఢిల్లీ ఘన విజయం
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement