21లోగా ఉద్యోగుల సమాచారమివ్వండి | Sakshi
Sakshi News home page

21లోగా ఉద్యోగుల సమాచారమివ్వండి

Published Wed, Oct 15 2014 12:59 AM

21 employees within the Information

హైదరాబాద్: రాష్ట్రస్థాయి కేడర్ పోస్టులు, ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈనెల 21లోగా రెండు రాష్ట్రాలోని ప్రతీ శాఖ ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఇరు రాష్ట్రాల పునర్విభజన విభాగాలు ఆదేశాలు జారీ చేశాయి. తండ్రి పుట్టిన జిల్లా పేరుతోపాటు ఆ జిల్లాలో స్థిరాస్తులుంటే వాటి వివరాలను కూడా అందులో తెలపాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఉద్యోగుల పంపిణీకి కీలక సమాచారం రాబట్టేం దుకు రెండు రాష్ట్రాలకు చెందిన శాఖల నోడల్ అధికారులతో ఇరు రాష్ట్రాల పునర్విభజన విభాగాల అధికారులు మంగళవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఆన్‌లైన్‌లో నాలుగు నమూనా పత్రాలను ఎలా పూరించాలో నోడల్ అధికారులకు అన్ని శాఖలకు వివరించారు. ఈ నెల 21లోగా వీటన్నింటినీ ఆన్‌లైన్‌లోనే పూరిం చాలని తెలిపారు. మూడో నమూనా పత్రాన్ని రెండు రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరి నుంచి వ్యక్తిగత వివరాలను రాబట్టేందుకు వీలుగా రూపొందించారు. రాష్ట్ర  కేడర్ ఉద్యోగులందరూ వివరాలు ఇవ్వాలని పేర్కొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement