Sakshi News home page

టేబుల్ ఫ్యాన్లో 'బంగారం'

Published Thu, Jul 2 2015 9:22 AM

టేబుల్ ఫ్యాన్లో 'బంగారం' - Sakshi

హైదరాబాద్ :  రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణీకుడు అక్రమంగా తీసుకొచ్చిన మూడు కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం దుబాయి నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీలో అతడికి చెందిన టేబుల్ ఫ్యాన్ చాలా బరువు ఉండటంతో కస్టమ్స్ అధికారులు సందేహించి ... క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

అందులోభాగంగా ఫ్యాన్ కింద భాగంలో భారీగా బంగారం బిస్కెట్లు ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఆ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు  స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement