గోదావరిలో ముగ్గురి గల్లంతు | Sakshi
Sakshi News home page

గోదావరిలో ముగ్గురి గల్లంతు

Published Sun, Oct 15 2017 4:29 PM

3 Youth Goes Missing in Godavari River - Sakshi

సాక్షి, మంచిర్యాల: జిల్లాలోని హాజిపూర్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. ముల్కల్ల పంపు హౌజ్ వద్ద గోదావరిలో స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే బెల్లంపల్లి ఏఎంసీకి చెందిన ఎనిమిదిమంది కుటుంబ సభ్యులు స్నానం కోసం గోదావరి నదిలోకి దిగారు. వీరిలో నలుగురు గల్లంతు కాగా అఖిల్ అనే వ్యక్తి క్షేమంగా బయటకు వచ్చాడు. అనిల్, మహేష్, వేణులు గల్లంతయ్యారు. అనిల్ 10వ తరగతి పూర్తి చేయగా మహేష్, వేణు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు.

Advertisement
Advertisement