వ్యవసాయ పథకాల్లో కేటాయించాలని కేంద్రం నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగంలో ప్రస్తుతం అమలవుతున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయిస్తున్న నిధుల్లో 30 శాతం మహిళా రైతులకు అందజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడే మహిళా రైతుల్లో ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందని స్పష్టం చేసింది. మహిళా స్వయం సంఘాల (ఎస్హెచ్జీ)కు సూక్ష్మ రుణాలు ఇవ్వడం ద్వారా వారిని ఆదుకోవాల ని భావిస్తోంది. గతేడాది నిర్ణయించిన విధంగా ఏటా అక్టోబర్ 15వ తేదీని మహిళా రైతు దినోత్సవంగా పాటించాలని స్పష్టంచేసింది. ఈ మేరకు రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని సూచించింది. మహిళా రైతే కేంద్ర బిందువుగా వ్యవసాయ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ను అమలు చేయాలని స్పష్టంచేసింది. అప్పుడే వ్యవసాయ ఉత్పత్తులు, ఉత్పాదకతలు పెరిగి ఐదేళ్లలో రైతు ఆదాయం రెట్టింపు చేయవచ్చని పేర్కొంది. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని వ్యవసాయ ఉన్నతాధికారులను కోరింది. ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ ఈ మేరకు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.
వ్యవసాయ రంగంలో తగ్గుదల
దేశంలో ఆర్థిక స్వాతంత్య్రం కలిగిన మహిళల్లో 80 శాతం మంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో పని చేస్తున్న వారేనని జాతీయ నమూనా సర్వే తేల్చినట్లు కేంద్రం తెలిపింది. ఆ 80 శాతం మందిలో 33 శాతం మహిళలు వ్యవసాయ కార్మికులుగా ఉన్నారు. 48 శాతం మంది వ్యవసాయ సంబంధిత రంగాల్లో స్వయం ఉపాధి కలిగిన మహిళా రైతులున్నారు. భారతదేశం సహా పలు వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలో గ్రామీణ మహిళ భాగస్వా మ్యం ఎక్కువగా ఉంది. మరోవైపు దేశంలో గత మూడు దశాబ్దాల్లో వ్యవసాయ రంగంలో పని చేస్తున్న పురుషులు, మహిళల సంఖ్య తగ్గుతోంది. వ్యవసాయ రంగంలో పని చేసే పురుషుల సంఖ్య 81 శాతం నుంచి 63 శాతానికి తగ్గగా, మహిళల సంఖ్య 88 శాతం నుంచి 79 శాతానికి తగ్గిందని జాతీయ సర్వేలో వెల్లడైనట్లు కేంద్రం వివరించింది. సాపేక్షికంగా ఇప్పటికీ వ్యవసాయంలో మహిళల పాత్ర గణనీయంగానే ఉందని తెలిపింది. అందువల్ల వ్యవసాయ పథకాల బడ్జెట్లలో 30 శాతం మహిళా రైతులకు కేటాయించేలా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని స్పష్టంచేసింది.
మహిళా రైతులదే కీలక పాత్ర
వ్యవసాయ రంగంలో మహిళా రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారు. సాగు మొదలు కోత వరకు పంటలకు అవస రమైన అన్ని పనుల్లో ఉంటున్నారు. పశువులు కాయడం, గడ్డి సేకరించడం, కోళ్ల పెంపకం, డెయిరీ నిర్వహణ ఇలా బహుళ రకాల వ్యవసాయ అనుబంధ పనుల్లోనూ కీలకంగా మారారు. కాని వ్యవసాయ కూలీలుగా వెళ్తున్న మహిళలు తీవ్ర వివక్షకు గురవుతున్నారు. పురుషుల కంటే వారితో ఎక్కువ పని చేయించి తక్కువ కూలీ ఇవ్వడం సర్వ సాధారణమైంది. ఈ పరిస్థితి మారాలని కేంద్రం భావిస్తోంది. రాష్ట్రాల్లో మహిళా రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించింది.
మహిళా రైతులకు 30 శాతం నిధులు!
Published Sun, Sep 3 2017 1:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆంధ్రా అతలాకుతలం..
అణగారిన వర్గాల ఆశాజ్యోతి సీఎం వైఎస్ జగన్
జగనన్న పాలనలో అందరికీ సంక్షేమం
సంక్షేమానికి ఆకర్షితులై వైఎస్సార్ సీపీలో చేరికలు
సంక్షేమ పథకాలను ఆపేసే కుట్ర
రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
డబ్బు పంపిణీ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయులు
No Headline
మూడోరోజు పోస్టల్ ఓటింగ్ ప్రశాంతం
ఈ ముగ్గురు ప్రత్యేకం!
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement