విందు భోజనం తిని 35 మంది అస్వస్థత | Sakshi
Sakshi News home page

విందు భోజనం తిని 35 మంది అస్వస్థత

Published Thu, May 7 2015 10:49 AM

35 fall ill after marriage feast, due to food poisoning

హైదరాబాద్: వివాహ వేడుకలో కలుషిత ఆహారం తిన్న దాదాపు 35 మంది అస్వస్థతకు గురయ్యారు. నగరంలోని ఫతేనగర్ పరిధిలోని ఇందిరాగాంధీపురానికి చెందిన ఒక జంట పెళ్లి రిసెప్షన్ బుధవారం రాత్రి మూసాపేట లోని విక్టోరియా గార్డెన్‌లో ఘనంగా జరిగింది. పెళ్లికి వచ్చిన అతిథులందరూ భోజనం కార్యక్రమాలు ముగించుకొని ఇళ్లకు చేరేసరికి గురువారం తెల్లవారింది.

రాత్రి తిన్న పెళ్లి భోజనం ఫుడ్ పాయిజన్ అవ్వడంతో వాంతులు విరేచనాలతో ఒక్కొక్కరుగా గాంధీ ఆస్పత్రికి ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగానే ఉంది.
 

Advertisement
Advertisement