డెంగ్యూతో చిన్నారి మృత్యువాత | Sakshi
Sakshi News home page

డెంగ్యూతో చిన్నారి మృత్యువాత

Published Fri, Aug 14 2015 2:45 PM

4 year old girl dies of dengue

బోయిన్‌పల్లి (కరీంనగర్) : కరీంనగర్ జిల్లా బోయిన్‌పల్లి మండలానికి చెందిన ఓ నాలుగేళ్ల బాలిక డెంగ్యూతో చనిపోయింది. బోయిన్‌పల్లికి చెందిన వడ్లకొండ పరశురాములు, కవిత దంపతుల కుమార్తె సాహితి(4) నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. వేములవాడ, సిరిసిల్ల ఆస్పత్రుల్లో చికిత్స పొందిన చిన్నారి ఈ నెల 12వ తేదీన డిశ్చార్జి అయి ఇంటికి చేరుకుంది.

కాగా పరిస్థితి కుదుటపడింది అనుకునే క్రమంలోనే గురువారం అకస్మాత్తుగా జ్వరం రావటంతో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే చిన్నారి గురువారం రాత్రి కన్నుమూసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement