ఖమ్మం అర్బన్: రైతులకు ఇది ఓ తీపి కబురు. సాగు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్న రైతులను గట్టెక్కించేందుకుగాను చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బృహత్తర కార్యక్రమాన్ని వచ్చే ఐదేళ్లలో పూర్తిచేయాలని, ఒక్కో చెరువుకు దాదాపు 50లక్షల రూపాయల వరకు వెచ్చించాలని నీటి పారుదల శాఖ అధికారులను మంత్రి హరీష్రావు ఆదేశించారు.
అంచనాల తయారీలో అధికారులు
జిల్లాలో బ్రిటీష్ కాలం నాటి చెరువులతోపాటు ఆ తర్వాత నిర్మించినవి కలిపి మొత్తం 4821 ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. వీటిలో అనేకం కొన్ని దశాబ్దాలుగా నిరుపయోగంగా పడున్నాయి.
ఈ చెరువుల కింద దాదాపు లక్ష ఎకరాల ఆయకట్టు ఉండవచ్చని అంచనా.
వీటి పునరుద్ధరణలో భాగంగా కట్టల బలోపేతం, పూడిక తీత, తూములు-అలుగుల ఏర్పాటు, కాల్వలకు మరమ్మతు తదితర పనులను చేపడతారు. మేజ ర్, మైనర్, మీడియం చెరువులతోపాటు కుంటలను కూడా పునరుద్ధరిస్తారు.
ఖమ్మం, భద్రాచలం, పాల్వంచ ఐబీ డివిజన్ల పరిధిలోగల మొత్తం చెరువుల అభివృద్ధికిగాను ఇంజనీర్లు అంచనాలు తయారుచేస్తున్నారు.
తొలి ఏడాదిలో జిల్లాలోని 960 చెరువులను పునరుద్ధరించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. నవంబర్ 8 తేదీ నాటికి 480 చెరువుల పునరుద్ధరణకు అంచనాలు రూపొందించాలని, 22వ తేదీ నాటికి మిగిలిన వాటి (480) అంచనాలు సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. జిల్లా అధికారులు ఇప్పుడు ఇదే పనిలో నిమగ్నమయ్యారు.
మట్టిని తరలించేందుకు రైతులు ముందుకొచ్చిన చెరువులకు తొలి ప్రాధాన్యమివ్వాలని అధికారులు నిర్ణయించారు. చెరువులోని మట్టిని తరలించేందుకు ఇప్పటివరకు ఉన్న అడ్డంకులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది.
జిల్లాలో ఐటీడీఏ పరిధిలోగల చెరువులను ఐబీ పరిధిలోకి బదలాయించి పునరుద్ధరిస్తారు.
జిల్లాలో గుర్తించిన చెరువులను పునరుద్ధరించేందుకు దాదాపు 3000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా.
అంచనాల రూపకల్పన, టెండర్ల ప్రక్రియను నవంబర్ చివరి నాటికి పూర్తిచేసి, డిసెంబర్లో పనులు ప్రారంభించే దిశగా అధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు.
అనుకున్న ప్రకారంగా వచ్చే ఐదేళ్ల నాటికి జిల్లాలోని చెరువులన్నిటినీ పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తే రైతుల ‘పంట’ పండినట్టేనని అధికారులు అంటున్నారు.
చెరువులకు మహర్దశ
Published Wed, Nov 5 2014 3:26 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement