రాళ్లతో కొట్టి.. గొడ్డలితో నరికి.. | Sakshi
Sakshi News home page

రాళ్లతో కొట్టి.. గొడ్డలితో నరికి..

Published Sat, May 13 2017 1:00 AM

A brutal murder

- నడిరోడ్డుపై ఓ వ్యక్తి దారుణహత్య
- బాణామతి, పాతకక్షలే కారణమా!


సదాశివపేట రూరల్‌: ఓ వ్యక్తిని ప్రత్యర్థులు నడిరోడ్డుపై గొడ్డలితో నరికి, రాళ్లతో కొట్టి చంపారు. పాతకక్షలు, బాణామతి చేస్తున్నాడన్న అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూర్‌ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన తలారి మల్లేశం (42) తన ఇంటి ఎదుట లారీలో వచ్చిన బండలను కిందికి దింపుతున్నాడు. అయితే రోడ్డుకు అడ్డంగా బండలు ఉన్నాయని అదే గ్రామానికి చెందిన తలారి నాగయ్య ఆక్షేపిస్తూ మల్లేశంతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి పరస్పర దాడులకు దారితీసింది.

విషయం ఇరువురి కుటుంబాలకు తెలియడంతో గొడవ మరింత పెరిగింది. తలారి నాగయ్య కుమారుడు అనిల్, యాదయ్యలు తమ బంధువులతో కలసి మల్లేశం (42)పై మూకుమ్మడిగా దాడి చేశారు. గొడ్డలితో నరికి, రాళ్లతో కొట్టి చంపారు. పరస్పర దాడిలో నాగయ్య కుమారుడు అనిల్‌ చేయి కూడా పూర్తిగా తొలిగిపోయింది. మెరుగైన వైద్యం కోసం అతడిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా, గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు పికెటింగ్‌ ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement