ప్రభుత్వాస్పత్రిలో పురుడు పోసుకున్న డాక్టర్‌ | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాస్పత్రిలో పురుడు పోసుకున్న డాక్టర్‌

Published Wed, May 10 2017 2:40 AM

ప్రభుత్వాస్పత్రిలో పురుడు పోసుకున్న డాక్టర్‌

అదే ఆస్పత్రిలో వైద్యులుగా పని చేస్తున్న భార్యాభర్తలు

కోల్‌సిటీ (రామగుండం): పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో కాంట్రాక్ట్‌ పద్ధతిపై పనిచేస్తున్న డాక్టర్‌ తిరుమల మంగళవారం ఇదే ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన తిరుమల భర్త చంద్రశేఖర్‌ కూడా ఇదే ఆస్పత్రిలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో డాక్టర్‌గా సేవలందిస్తున్నాడు.

ప్రభుత్వాస్పత్రిలో ప్రసూతి సేవలను ప్రజల్లో నమ్మకం కల్పించడానికి తన భార్యను ప్రభుత్వాస్పత్రిలోనే డెలివరీ చేయించినట్లు డాక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. వైద్య దంపతులను ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ సూర్యశ్రీ రావుతోపాటు తోటి డాక్టర్లు, ఉద్యోగులు అభినందించారు.

Advertisement
Advertisement