సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ తయారీ తుది దశకు చేరుకుంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆధారంగా నిర్ధారించే రుణ పరిమితి లెక్కతేలింది. ఎఫ్ఆర్బీఎం (ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం) ప్రకారం రాష్ట్రాల ద్రవ్యలోటు జీఎస్డీపీలో మూడు శాతానికి మించకూడదు. అంటే జీఎస్డీపీలో గరిష్టంగా 3 శాతం మేరకు రాష్ట్రాలు రుణాలు తెచ్చుకునే వీలుంటుంది. కొత్త జీఎస్డీపీ ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు రూ.20 వేల కోట్లకు మించి రుణ పరిమితి ఖరారవనుంది.
ఇటీవల రాష్ట్ర అర్థ గణాంక శాఖ రూపొందించిన 2015-16 జీఎస్డీపీ నివేదికను తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ. 5,83,117 కోట్లు, గత ఏడాదితో పోలిస్తే 11.7 శాతం వృద్ధి రేటును నమోదు చేసినట్లుగా ప్రకటించింది. దీని ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితి కూడా పెరగనుంది. మరోవైపు ఎఫ్ఆర్బీఎం పరిమితిని 3 నుంచి 3.5 శాతానికి పెంచాలని గత ఏడాదిగా రాష్ర్ట ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతూనే ఉంది. రెవెన్యూ మిగులుతో పాటు ద్రవ్య నిర్వహణలో క్రమశిక్షణ పాటించిన రాష్ట్రాలకు రుణ పరిమితి పెంచేందుకు వీలుగా 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది.
అదే ప్రాతిపదికన తమకు వెసులుబాటు ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వ వాదన. గత ఏడాది (2015-16) బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ద్రవ్యలోటును 3.49 శాతంగా చూపించింది. రూ.16,969 కోట్ల రుణ సమీకరణకు అంచనాలు వేసుకుంది. కానీ రాష్ట్రం విజ్ఞప్తిని పట్టించుకోకుండా గరిష్ట రుణ పరిమితి మూడు శాతానికి లోబడే ఉండాలంటూ కేంద్ర ఆర్థికశాఖ సీలింగ్ విధించింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ఎదురుచూసిన రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశే మిగిలింది. దీంతో వచ్చే బడ్జెట్లో ద్రవ్యలోటు నిర్ధేశించిన పరిమితికి కట్టుబడి ఉండాలా..? పెంపు కోరుతున్న మేరకు అంచనా వేసుకోవాలా..? అని రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. బడ్జెట్ తయారీలో ఎఫ్ఆర్బీఎం రుణపరిమితి కీలకమైన అంశం కావటంతో కొత్త జీఎస్డీపీ లెక్కలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. దీని ప్రకారం మూడు శాతం లెక్కిస్తే రూ.17,493 కోట్లు, మూడున్నర శాతం లెక్కగడితే రూ.20,409 కోట్లు రుణ పరిమితి ఖాయమైంది. వచ్చే ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ కావటంతో ప్రస్తుత ధరల ఆధారంగా లెక్కించిన స్థూల ఉత్పత్తిని 2016-17 సంవత్సరానికి అంచనా వేస్తే ఎఫ్ఆర్బీఎం పరిమితి రూ.20 వేల కోట్లు దాటడం ఖాయమైంది.
సిద్ధమైన సీలింగ్ బడ్జెట్
బడ్జెట్ తయారీలో కీలకమైన శాఖలవారీ కేటాయింపుల ప్రక్రియ తుది దశకు చేరింది. సీఎం ఆదేశాల మేరకు గత నెల 16వ తేదీ వరకు అన్ని శాఖలు తమ బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు అందించాయి. వీటిని పరిశీలించిన సీఎం, ఏ శాఖకు ఎంత కేటాయించాలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీంతో శాఖలవారీగా కేటాయింపుల ప్రక్రియ పూర్తయింది. వచ్చే ఏడాది బడ్జెట్లో ప్రణాళిక పద్దులో ఆయా శాఖలకు ఇచ్చే అంచనా కేటాయింపులను(సీలింగ్ బడ్జెట్) సీల్డ్ కవర్లో చేరవేశారు. తమకు నిర్దేశించిన నిధుల్లో ఏయే పథకాలకు ఎంత అవసరం.. ఏయే పద్దుకు ఎంత కేటాయింపులుండాలి.. అని సంబంధిత శాఖలు ఆఖరి కసరత్తు చేయటమే మిగిలింది. వీటి ఆధారంగా బడ్జెట్లో పొందుపరచాల్సిన తుది కేటాయింపులు ఖరారవుతాయి. రెండు రోజుల వ్యవధిలో వీటిని పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది.
రూ.20 వేల కోట్లకుపైగా రుణ పరిమితి
Published Thu, Mar 3 2016 3:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
T20 World Cup: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు స్పాన్సర్గా అమూల్...
పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే
ఇచ్చిన మాట కోసం హాలీవుడ్ ఆఫర్ వదులుకున్న రాజమౌళి!
గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం
త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్
Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్గా గృహప్రవేశం (ఫోటోలు)
ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "
నెటిజన్ ఘాటు ప్రశ్న.. ఆనంద్ మహీంద్రా దీటు సమాధానం
ఇండియాలో హిట్ కొట్టిన వెబ్ సిరీస్.. సీజన్ 3 రిలీజ్ డేట్ ఇదే
తప్పక చదవండి
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
- జిమ్ చేస్తూ కుప్పకూలిన యువకుడు..చివరకు వీడియో వైరల్
- సీరియల్ నటి సీమంతం.. ఫోటోలు వైరల్
- సురేశ్ రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు మృతి
- నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
- నా బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్లో వారిద్దరే ఉన్నారు.. ఎన్టీఆర్ లేడు: రాజమౌళి
- ‘ఫోన్ ట్యాపింగ్లో రేవంత్, హరీష్ రావు కూడా బాధితులే’
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
Advertisement